Wednesday, August 5, 2026 08:50 AM
Wednesday, August 5, 2026 08:50 AM

తిరుమల కొండ పై అక్రమాలు ఆగేదెప్పుడు?

తిరుమల కొండపై ఇప్పుడు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గత అయిదేళ్లుగా అన్ని రూపాల్లో సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు అదే స్పీడ్ ని ప్రభుత్వం మారినా కంటిన్యూ చేయడం చికాకుగా మారింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు తిరుమలలో టికెట్ లు అమ్ముకున్నారని ఆరు టికెట్ లను లక్ష రూపాయలకు అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటివి చాలానే గత అయిదేళ్ళలో జరిగినా బయటకు రాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ సంచలనం రేపుతున్నాయి. తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తిరుమలలో మరో దళారిని పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా పాండిచ్చేరి సీఎం లేఖ పై విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల అధిక ధరకు విక్రయించేందుకు దళారీ ప్లాన్ చేయడం గమనార్హం. తిరుమల టూ టౌన్ పోలీసులు దళారీ బద్మనాభం అలియాస్ భరత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 21 న నెల్లూరుకు చెందిన 5 మంది భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని రూ. 23 వేలు తీసుకున్నాడు బద్మనాభం. విఐపి దర్శనం టికెట్స్ కాకుండా రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పించాడు.

Also Read : సంచలన నిర్ణయం దిశగా లోకేష్

విఐపి దర్శనం టికెట్లు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని నెల్లూరుకు చెందిన భక్తుడు విజయ్ కుమార్ డిమాండ్ చేసాడు. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు బద్మనాభం నిరాకరించడంతో టిటిడి విజిలెన్స్ అధికారులకు విజయ్ కుమార్ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు భక్తుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తిరుమల టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసారు విజిలెన్స్ అధికారి శంకర్ బాబు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో విజిలెన్స్ అధికారులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్