Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

సానుభూతి కోసం జగన్ నయా స్కెచ్

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ రాజకీయం ఎలా ఉంటుందో ఊహించడం కొన్ని సందర్భాల్లో కష్టంగానే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలను కొంతమంది తక్కువగా తీసుకున్నా.. ఆయన మాత్రం చేసేది చేస్తూనే ఉంటారు. తన పరిస్థితి ఎలా ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సానుభూతి రాజకీయాలను జగన్ మొదలు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీకి రాజీనామా చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారు.

Also Read : బాబు సీనియర్… ఇక నీ సేవలు చాలు..!

ఇప్పటికే దీనిపై మీడియాకు లీకులు కూడా ఇచ్చారు జగన్. వారిని శాసనసభ సమావేశాలకు పంపే విధంగా జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనను మరింత బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారని, తన ఎమ్మెల్యేలను కూడా లాక్కుంటున్నారని, ప్రజల్లోకి కొత్త వ్యూహంతో అడుగుపెట్టేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు జగన్ సలహాలు, సూచనలు కూడా ఇచ్చారట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సరే జగన్ కు పెద్దగా సానుభూతి రాలేదు.

Also Read : అరెస్ట్ బెదిరింపులు.. చివరకు బెదిరింపులతో అరెస్ట్

అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలతో పార్టీకి రాజీనామా చేయించి, వారిని శాసన సభా సమావేశాలకు పంపి.. టిడిపి నేతలకు దగ్గర చేయాలని జగన్ ఓ ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపి నేతలతో టచ్ లోకి కూడా వెళ్లారు. ఇక దీని ద్వారా తనకొచ్చిన 11 మంది ఎమ్మెల్యేలలో అయిదుగురు ఎమ్మెల్యేలను లాక్కున్నారని… 2019 ముందు కూడా ఇలాగే జరిగిందని జగన్ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : బూమ్రా లేడు.. భారం మొత్తం ఆ ఇద్దరిపైనే…!

అప్పట్లో టిడిపిలోకి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని జగన్ గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు తన పార్టీ నాయకులను సొంతగా తానే రాజీనామా చేయించి సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక ఇప్పటికే అగ్నిప్రమాదం ద్వారా జగన్ సానుభూతి ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ కొత్త వ్యూహం అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్