Tuesday, October 21, 2025 06:31 AM
Tuesday, October 21, 2025 06:31 AM
roots

NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Dubai International Airport) భారతీయులు మరో రికార్డు సృష్టి్ంచారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు (Indians tops the list of passengers in DXB). మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్‌పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.

ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివారల ప్రకారం, గతేడాది మొత్తం 86,994,365 మంది ప్రయాణికులు దుబాయ్ మీదుగా రాకపోకలు సాగించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 31.7 శాతం అధికం. 2019 నాటి గరిష్ఠంతో పోలిస్తే ఇది ఒకశాతం ఎక్కువ. ముఖ్యంగా గతేడాది ద్వితీయార్థంలో ప్రయాణికుల రాకపోకల్లో గణీయ వృద్ధి కనిపించిందని దుబాయ్ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రయాణికుల రాకపోకలు గరిష్ఠస్థాయికి (7.9 మిలియన్) తాకాయి.

ఇక దేశాల వారీగా చూస్తే అత్యధికంగా11.9 మిలియన్ మంది భారతీయులు దుబాయ్ మీదుగా ప్రయాణించారు. ఆ తరువాత స్థానంలో సౌదీ అరేబియా వాళ్లు ఉన్నారు. 6.7 మిలియన్ల సౌదీ వాసులు దుబాయ్ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించారు. 5.9 మిలియన్ల ప్రయాణికులతో బ్రిటన్ మూడోస్థానంలో నిలిచింది.

ప్రస్తుతం దుబాయ్ ఎయిర్ పోర్టు ద్వారా 104 దేశాల్లోని 262 గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మొత్తం 102 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఈ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు అందిస్తున్నాయి

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్