Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

కేతిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్…?

ఏపీలో టిడిపి సోషల్ మీడియా ఒత్తిడికి లొంగో లేక పవన్ కళ్యాణ్ కామెంట్లకి షాక్ కొట్టో తెలియదు కానీ.. ఇప్పుడు వైసీపీ నేతల అక్రమాల విషయంలో కాస్త సీరియస్ గానే అడుగులు పడుతున్నాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు అక్రమాలను బయటకు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రెడీ అయ్యారు. టీడీఆర్ బాండ్ లు అలాగే భూ కబ్జాల విషయంలో సర్కారు సీరియస్ గానే అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ అక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఎక్కువగా దోచుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. అందుకే సర్కార్ ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ చేసింది.

Also Read : తోక ముడిచి.. ఆరోపణలు ఫేక్ అని ఒప్పుకున్న వైసీపీ..!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని వడియార్ చెరువు ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతికి నోటీసులు పంపారు. సర్వేనెంబర్ 661-1 (908,909,910) లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జల వనరుల శాఖ నోటీసులు ఇవ్వడంతో చర్యలకు దిగారు. దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నోటీసులో పేర్కొన్న అధికారులు… నోటీసు అందుకున్న ఏడు రోజుల్లో చెరువు భూమిని ఖాళీ చేయాలని నోటీసులో స్పష్టంగా ప్రస్తావించారు. చెరువు భూమిని ఖాళీ చేయకపోతే… స్వాధీనం చేసుకుంటామని నోటీసులో జల వనరుల శాఖ అధికారులు హెచ్చరించడం గమనార్హం.

Also Read : రౌడీషీటర్ కు రాచమర్యాదలా.. సిగ్గు సిగ్గు..!

గతంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బాగోతంపై పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఆధారాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన చేతికి మట్టి అంటకుండా సోదరుడు కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రధాన అనుచరుడు సూర్యనారాయణకు కూడా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మార్వో నోటీసులు కూడా ఇచ్చారు. చర్యలు మొదలవడంతో వైసీపీ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్