Thursday, February 5, 2026 01:17 AM
Thursday, February 5, 2026 01:17 AM

బీఎస్ఎన్ఎల్ సరికొత్త అడుగు.. భారత్ నూతన అధ్యాయం..!

టెలి-కమ్యూనికేషన్ రంగంలో భాగంగా.. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం బిఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4G నెట్వర్క్ కు శ్రీకారం చుట్టారు. దీనితో టెలికాం పరికరాలను తయారు చేసే దేశాల జాబితాలోకి భారత్ అడుగు పెట్టింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రజతోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి 97,500 కి పైగా మొబైల్ 4G టవర్లను ప్రారంభించారు. వాటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కు చెందిన 92,600 4జీ టెక్నాలజీ సైట్లు కూడా ఉన్నాయి.

Also Read : టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక కఠిన చర్యలు

ఈ టవర్లను దాదాపు రూ.37,000 కోట్ల వ్యయంతో ‘స్వదేశీ’ సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించారు. ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ ప్రారంభంతో, స్వదేశీ టెలికాం పరికరాలను తయారు చేసే డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా మరియు చైనా వంటి దేశాల జాబితాలోకి భారత్ అడుగు పెట్టింది. భారత్ లో తయారు చేసిన ఈ నెట్వర్క్ క్లౌడ్ ఆధారంగా పని చేస్తుంది. ఆ తర్వాత 5 జీ నెట్వర్క్ ను కూడా సులువుగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీనితో ఒడిశాలోని 2,472 గ్రామాలతో సహా, మారుమూల, సరిహద్దు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలోని 26,700 కి పైగా గ్రామాలకు నెట్వర్క్ అందనుంది.

Also Read : చంద్రబాబు సీరియస్.. బాలయ్య క్షమాపణ చెప్తారా..?

20 లక్షలకు పైగా కొత్త సబ్‌ స్క్రైబర్‌ లకు సేవలందిస్తుందని ప్రకటన బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ టవర్లు అన్నీ పూర్తిగా సౌరశక్తితో పని చేస్తాయి. డిజిటల్ భారత్ నిధి ద్వారా భారత్ కు చెందిన 100 శాతం 4జీ నెట్‌వర్క్‌ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 29,000 నుండి 30,000 గ్రామాలు మిషన్-మోడ్ ప్రాజెక్ట్‌ లో అనుసంధానించారు. ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబు నాయుడు ఈ సేవలను ప్రారంభించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్