Monday, September 15, 2025 05:47 PM
Monday, September 15, 2025 05:47 PM
roots

వరల్డ్ వైడ్ గా మిరాయ్ డామినేషన్.. సెంచరీ మార్క్ పక్కా..!

చేసినవి రెండు సినిమాలే అయినా.. యువ నటుడు తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాడు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మిరాయ్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. అదిరిపోయే ఓపెనింగ్స్ తో 100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : భోగాపురంలో ఫస్ట్ విమానం ఎప్పుడో తెలుసా..?

ఇండియాలో 50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. వీకెండ్ లో రిలీజ్ కావడం, న్యూట్రల్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు కలిసి వచ్చింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా.. ఇండియాలో మొత్తం రూ 57.50 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఏ మాత్రం స్టార్ ఇమేజ్ లేకపోయినా తేజా సజ్జా సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటుగా దీనికి మరో సినిమా పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

Also Read : ఐటీ రిటర్న్ కు నేడే లాస్ట్ డేట్.. జరిమానా ఎంతంటే..!

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లో అమెరికాలో ఇప్పటికే 1.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రేడ్ అనలిస్ట్ ల అంచనా ప్రకారం ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ లో 25 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఫస్ట్ వీక్ ఎండ్ లో మొత్తం 83 కోట్లు వసూలు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డం సినిమా కేవలం 82.05 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. మంగళవారం నాటికి ఈ సినిమా వంద కోట్లు సాధించడం ఖాయంగా కనపడుతోంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే హరిహర వీరమల్లు, తండేల్ సినిమా కలెక్షన్స్ కూడా బీట్ చేయడం ఖాయంగా కనపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఐటీ రిటర్న్ కు...

ఆదాయపు పన్ను దాఖలు విషయంలో సంబంధిత...

యూరియా వాడితే క్యాన్సర్.....

ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో...

సజ్జలను లైట్ తీసుకోండి.....

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ...

భోగాపురంలో ఫస్ట్ విమానం...

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి...

వైసీపీ నేతలకు ఆ...

ఏపీలో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి...

సజ్జల ప్రకటనతో వైసీపీలో...

వైసీపీ అధికారంలోకి వస్తే.. అమరావతి రాజధాని...

పోల్స్