Sunday, March 22, 2026 07:45 AM
Sunday, March 22, 2026 07:45 AM

బోరుగడ్డ కేసులో కీలక పరిణామం

గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిల్ తో బయటకు వెళ్లి వచ్చిన అనీల్.. జైలులో లొంగిపోయాడు. మధ్యంతర బెయిల్ వ్యవహారం సంచలనంగా మారింది. అతను తప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించి కోర్ట్ ను సైతం మోసం చేసాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో అతనిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : జగన్‌ను అనుకరిస్తున్న కేటీఆర్..!

అనుబంధ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగగా… కోర్టు నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని బోరుగడ్డను హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనంపై విచారణ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు వారం రోజుల పాటు కోర్ట్ వాయిదా వేసింది. తన తల్లికి హార్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని ఓ లేఖను సృష్టించాడు అనీల్.

Also Read : విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకి రంగం సిద్దం..!

గుండె సంబంధిత ఇబ్బందితో తల్లి ఇబ్బంది పడుతోందని.. చెన్నై ఆస్పత్రిలో ఉన్నారని కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలంటూ గతంలో హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ వేసాడు. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ ఇచ్చిన రిపోర్టును కోర్టుకు సమర్పించాడు. ఆ రిపోర్ట్ పై అనుమానాలు రావడంతో పోలీసులు విచారణ చేసి.. అతని తప్పుడు డాక్యుమెంట్ అని గుర్తించారు. అతను జైలు నుంచి విడుదలైన విషయం కూడా ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్