Wednesday, February 4, 2026 07:43 PM
Wednesday, February 4, 2026 07:43 PM

కోహ్లీ, రోహిత్ పై బోర్డు రాజకీయాలు.. మాజీ క్రికెటర్ సంచలనం

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడం సంచలనం అయింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తారు అని భావించినా.. అనూహ్యంగా ఈ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. దీని వెనుక హెడ్ కోచ్ గంభీర్ ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. అతని రాజకీయాల కారణంగానే ఈ ఇద్దరూ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు అనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఒకరి తర్వాత ఒకరు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై అభిమానుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Also Read : ధోనీ తప్పించాడు.. సచిన్ అండగా నిలిచాడు..!

తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రి దీనిపై సంచలన కామెంట్స్ చేసాడు. విరాట్ కోహ్లీలో ఇంకా ఆడే సత్తా ఉందని.. అతను మరో రెండేళ్ళ పాటు క్రికెట్ ఆడతాడు అని.. కోహ్లీ టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి రావాలని వ్యాఖ్యానించాడు. కానీ అతను దురదృష్టవశాత్తు జట్టు నుంచి తప్పుకున్నాడని, దీని వెనుక ఖచ్చితంగా అంతర్గత రాజకీయాలు ఉన్నాయని.. చివరకు అంత గొప్ప ఆటగాడికి సరైన వీడ్కోలు కూడా పలకలేదు అని మండిపడ్డాడు. ఇప్పటికైనా అతనికి మంచి వీడ్కోలు పలకాలని కోరాడు.

Also Read : పొట్టి ఫార్మాట్ కెప్టెన్ గా గిల్..? షాక్ ఇచ్చిన బోర్డు..!

ఈ రాజకీయాలను అర్ధం చేసుకోవడం కష్టమన్నాడు. బోర్డు, సెలెక్టర్ లు ఏం ఆలోచిస్తున్నారో కూడా అర్ధం కాదని కామెంట్ చేసాడు. దీనితో పాటు, వీరిద్దరూ త్వరలో వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోవచ్చని, 2027లో ప్రపంచ కప్ ఆడకపోవచ్చు అని అభిప్రాయపడ్డాడు. వాళ్ళు ఇద్దరూ టెస్ట్ క్రికెట్ తో పాటుగా పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్