Thursday, February 5, 2026 03:10 AM
Thursday, February 5, 2026 03:10 AM

తిరుమల కొండ పై అక్రమాలు ఆగేదెప్పుడు?

తిరుమల కొండపై ఇప్పుడు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గత అయిదేళ్లుగా అన్ని రూపాల్లో సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు అదే స్పీడ్ ని ప్రభుత్వం మారినా కంటిన్యూ చేయడం చికాకుగా మారింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు తిరుమలలో టికెట్ లు అమ్ముకున్నారని ఆరు టికెట్ లను లక్ష రూపాయలకు అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటివి చాలానే గత అయిదేళ్ళలో జరిగినా బయటకు రాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ సంచలనం రేపుతున్నాయి. తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తిరుమలలో మరో దళారిని పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా పాండిచ్చేరి సీఎం లేఖ పై విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల అధిక ధరకు విక్రయించేందుకు దళారీ ప్లాన్ చేయడం గమనార్హం. తిరుమల టూ టౌన్ పోలీసులు దళారీ బద్మనాభం అలియాస్ భరత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 21 న నెల్లూరుకు చెందిన 5 మంది భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని రూ. 23 వేలు తీసుకున్నాడు బద్మనాభం. విఐపి దర్శనం టికెట్స్ కాకుండా రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పించాడు.

Also Read : సంచలన నిర్ణయం దిశగా లోకేష్

విఐపి దర్శనం టికెట్లు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని నెల్లూరుకు చెందిన భక్తుడు విజయ్ కుమార్ డిమాండ్ చేసాడు. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు బద్మనాభం నిరాకరించడంతో టిటిడి విజిలెన్స్ అధికారులకు విజయ్ కుమార్ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు భక్తుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తిరుమల టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసారు విజిలెన్స్ అధికారి శంకర్ బాబు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో విజిలెన్స్ అధికారులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్