Wednesday, February 4, 2026 09:49 AM
Wednesday, February 4, 2026 09:49 AM

ఆపరేషన్ సిందూర్ లెక్కలు బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – వర్సెస్ పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు యుద్ధం దిశగా వెళ్ళిన సంగతి తెలిసిందే. పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ఆ దేశ సైన్యం కూడా ప్రతిస్పందించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. భారత్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో పాక్ ఫెయిల్ అయినా సరే ఆ దేశ మీడియా మాత్రం తామే విజయం సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేసింది. దీనికి భారత రక్షణ శాఖ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది.

Also Read : మిధున్ రెడ్డిని రౌండప్ చేసిన సిట్..!

ఇక తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం ఆసక్తికర కామెంట్స్ చేసారు. పాక్ ఘోరంగా ఫెయిల్ అయిందని.. అయినా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానిస్తూ.. భారత సైన్యం మూడు హ్యాంగర్లు, నాలుగు రాడార్లతో సహా 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని వెల్లడించారు. భారత సైన్యం 1 C-130 విమానాలను, ఒక ఎయిర్‌ బోర్న్ ఎర్లీ వార్నింగ్, విమానాన్ని, నాలుగు నుండి ఐదు ఫైటర్ జెట్‌ లను కూడా ధ్వంసం చేసిందని వెల్లడించారు.

Also Read : అంచనాలను అందుకోలేని తెలుగు కుర్రాడు..?

న్యూఢిల్లీలో జరిగిన ఐక్యరాజ్య సమితి దళాల సహకార దేశాల చీఫ్స్ కాన్క్లేవ్‌ లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. 300 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన గ్రౌండ్ టు ఎయిర్ కిల్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. పాకిస్తాన్ కు ప్రతిస్పందించే టైం ఇవ్వలేదని పేర్కొన్నారు. వాళ్ళు ప్రయోగించిన డ్రోన్ లు, రాకెట్ లు, క్షిపణులు అన్నీ ఫెయిల్ అయ్యాయని అన్నారు. ఎనిమిది వైమానిక స్థావరాలను భారత ఆర్మీ టార్గెట్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ కు ఏ క్షణంలో అయినా బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్