Wednesday, February 4, 2026 08:24 AM
Wednesday, February 4, 2026 08:24 AM

జీఎస్టీ ఎఫెక్ట్.. ఏపీలో భారీగా వాహనాల అమ్మకాలు..!

దేశ వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మధ్య తరగతికి పలు ధరలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వాహనాలు, మందులు, సిమెంట్ సహా పలు ధరలు తగ్గాయి. దీనితో ఈ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ సంస్కరణల ప్రభావం కూడా భారీగా కనపడుతోంది. దీనిపై ఏపీ రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. వాహనాల కొనుగోళ్ళు ఏ స్థాయిలో పెరిగాయో ఆయన వివరించారు.

Also Read : వైసీపీ కోసం పని చేస్తున్న చంద్రబాబు..!

జీఎస్టీ ప్రభావంతో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయని తెలిపారు. కొత్త పన్ను విధానం ప్రజలకు ఊరట ఇచ్చిందని, దీనితో రోజుకి 4 వేల రిజిస్ట్రేషన్ల దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారని ఆయన వివరించారు. మంత్రి వివరాల ప్రకారం, సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ జరిగాయని పేర్కొన్నారు. భారీ వాహనాల నుంచి ఆటోల వరకు భారీ అమ్మకాలు జరిగాయని వివరించారు.

Also Read : ఎక్కడ దాక్కున్నా వదలను.. జగన్ సంచలన కామెంట్స్

వీటిలో మోటార్ సైకిళ్లు 2,352, కార్లు/క్యాబ్‌లు 241, ట్రాక్టర్లు 60, ఆటోలు 227, గూడ్స్ వాహనాలు 47, ఆటో గూడ్స్ వాహనాలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నట్టు తెలిపారు. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ వేగం పెరుగుతుందని వివరించారు. త్వరలోనే రోజుకు 4,000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని వెల్లడించారు. అటు సిమెంట్ ధరలు భారీగా తగ్గడంతో నిర్మాణ రంగం కూడా ఊపు అందుకునే సంకేతాలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్