Sunday, March 22, 2026 01:51 AM
Sunday, March 22, 2026 01:51 AM

విజయసాయి రెడ్డి సంగతేంటి..? అప్రూవర్ గా మారారా..?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పలు ఆసక్తికర వ్యవహారాలు కనపడుతున్నాయి. ఈ కేసులో 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు వారిని పలు దఫాలుగా విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఏసీబీ కోర్ట్ ముందు చార్జ్ షీట్ దాఖలు చేసారు సిట్ అధికారులు. రెండు చార్జ్ షీట్ లను దాఖలు చేయగా.. వాటిలో మొత్తం 21 అభ్యంతరాలను ఏసీబీ న్యాయమూర్తి వ్యక్తం చేసారు. అందులో ప్రధానంగా 7 నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది.

Also Read : అరుణ ఫోన్ లో ఐపిఎస్, మాజీ మంత్రి వీడియోలు..?

అందులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కేసులో విజయసాయి రెడ్డి సమాచారం ఆధారంగానే నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ కేసిరెడ్డి సహా పలువురు నిందితులకు సంబంధించిన సమాచారం ఆయనే అందించినట్టు వార్తలు రాగానే ఆయన అప్రూవర్ గా మారారు అనే ప్రచారం జరిగింది. కానీ ఈ కేసులో ఎవరినీ అప్రూవర్ గా సిట్ అధికారులు చార్జ్ షీట్ లో ప్రస్తావించలేదు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకోలేదు సిట్.

Also Read :జగన్ తిరుమలకు రావొద్దు.. వైసీపీలో అంతర్గత తిరుగుబాటు

కాబట్టి ఏసీబీ కోర్ట్ లో ఆయనకు సంబంధించి ఏ సమాచారం చెప్తారు అనేదే ఆసక్తిని కలిగించే అంశం. లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ మొదలు కాగానే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చేసారు. మరి విజయసాయి రెడ్డిని అప్రూవర్ గా ప్రస్తావిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అటు కోర్ట్ 3500 కోట్లకు సంబంధించి టేబుల్ తో కూడిన సమాచారం అడిగింది. ఎవరి నుంచి ఎవరికి నిధులు వెళ్ళాయి అనే ప్రశ్న అడిగింది. అందులో విజయసాయి రెడ్డి ప్రస్తావన ఉండే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్