ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే.. ఎకనామిక్ టైమ్స్ అందించే బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డ్ ను దక్కించుకున్న తొలి రాజకీయ నాయకుడు కావడంతో టీడీపీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్ లో జరుగుతోన్న కలెక్టర్ ల కాన్ఫరెన్స్ లో.. మంత్రులు, కలెక్టర్ లు, ఇతర ఉన్నతాధికారులు సిఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
Also Read : పాపం నిధీ.. రాజాసాబ్ హీరోయిన్ కు చుక్కలు..!
స్టాండింగ్ ఓవేషన్ ద్వారా చంద్రబాబును అభినందించారు. అటు సోషల్ మీడియాలో సైతం పలువురు ప్రముఖులు చంద్రబాబును అభినందించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ తరహా అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదు అన్నారు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, కలెక్టర్లదే అంటూ అభినందించారు.
Also Read : కూటమిలో ఆ ఇద్దరి వల్లే చిచ్చు..!
గత ప్రభుత్వంలో ధ్వoసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామన్నారు. గతంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విషయంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రతీ ఏడాదీ ఏపీనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పూర్తి కాగా ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు శాంతి భద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష అనంతరం సిఎం.. ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

