ఆంధ్రప్రదేశ్ లో ఏనుగుల బెడద ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను కంగారుపడుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు అలాగే ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల ప్రభావం ఎక్కువగా ఉంది. పంట పొలాలను రైతులు కాపాడుకోవడానికి భయపడిపోతున్నారు. పెద్ద ఎత్తున ఏనుగులు గ్రామాల్లోకి రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న రైతులు వ్యవసాయం మానేసి వలస వెళ్లిపోతున్నారు. అరటి, చెరుకు వంటి పంటలను పెద్ద ఎత్తున ఏనుగులు నాశనం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read : మాజీ కాంగ్రెస్ ఎంపీల కోసం అన్న తంటాలు
నాలుగు నెలల క్రితం ఏపీ ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.. బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలో ఉన్న కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు.. ఆయన కర్ణాటక అటవీ శాఖతో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలో 40 ఏనుగులు ఉండగా వాటిలో నాలుగు ఏనుగులను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. చిత్తూరుకు రెండు ఏనుగులు, అలాగే ఉత్తరాంధ్రకు రెండు ఏనుగులు చొప్పున కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read : మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. విద్యాశాఖ కీలక ప్రకటన
దీనికోసం ఎంఓయు కూడా కంప్లీట్ అయింది. దానికి తోడు అటవీ శాఖ అధికారులకు ఆ ఏనుగులను ఎలా డీల్ చేయాలో శిక్షణ కూడా ఇచ్చారు. దాదాపు నెలరోజుల పాటు శిక్షణ కొనసాగింది. అయినా సరే ఇప్పటివరకు ఏనుగులు రాలేదు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఉప సర్పంచ్ ను ఏనుగులు చంపటంపై ఆందోళన వ్యక్తం అయింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తాజాగా సచివాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
Also Read : సోమవారం టెస్ట్ పాస్ అయిన తండేల్.. అంచనాలకు మించి కలెక్షన్లు
అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాముతో మాట్లాడిన చంద్రబాబు.. జనావాసాలు పంట పొలాలపై ఏనుగుల దాడులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని అడ్డుకునేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను త్వరగా తీసుకురావాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాజెక్టు విషయంలో ఆలస్యం చేయొద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనితో త్వరలోనే అటవీ శాఖ బృందం కర్ణాటక వెళ్లనుంది.