Thursday, February 5, 2026 03:04 AM
Thursday, February 5, 2026 03:04 AM

18 ఏళ్ళలో తొలిసారి.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త రికార్డు

భారత్ సంచార్ నిగం లిమిటెడ్… దశాబ్దాలుగా టెలికాం యూజర్లకు ఎంతో సుపరిచితమైన నెట్వర్క్ ఇది. అయితే 2015 తర్వాత నుంచి క్రమంగా ఈ నెట్వర్క్ తన ప్రాభవం కోల్పోతూ వస్తోంది. ఇదే సమయంలో జియో నెట్వర్క్ ఎంటర్ కావడం బిఎస్ఎన్ఎల్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దానికి తోడు ఇతర నెట్వర్క్ ల దూకుడు అందుకోలేకపోవడం.. సర్వీస్ విషయంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేయడంతో చాలామంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ విషయంలో ఆసక్తి చూపించలేదు.

Also Read : ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్

అయితే గత రెండు మూడేళ్ల నుంచి బిఎస్ఎన్ఎల్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. టాటా గ్రూప్ టేక్ అప్ చేసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను దగ్గర చేసుకునేందుకు అనేక వ్యూహాలను అవలంబించింది. ఇదే సమయంలో ఇతర నెట్వర్క్ ల రేట్లు పెరగడం కూడా బిఎస్ఎన్ఎల్ కు కలిసి వచ్చిన అంశం. ఇతర నెట్వర్క్ లు నెలనెలా భారీగా రేట్లు పెంచడంతో బిఎస్ఎన్ఎల్ వైపు యూజర్లు మొగ్గు చూపారు. ఇక దానికి తోడు నెట్వర్క్ ను విస్తరించే విషయంలో కూడా బిఎస్ఎన్ఎల్ జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బిఎస్ఎన్ఎల్.. సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

Also Read : కడప జిల్లా స్వీప్ చెయ్యాలి.. చంద్రబాబు సంచలన కామెంట్స్

దీనితో 18 ఏళ్ల తర్వాత లాభాల బాట పట్టింది బిఎస్ఎన్ఎల్. ఈ ఏడాది క్యూ 4లో 250 కోట్ల రూపాయల ఆదాయం గడించినట్లు పేర్కొంది. 18 ఏళ్లలో వరుసగా రెండు త్రైమాసికాల్లో లాభాలు పొందడం ఇదే తొలిసారి అని ప్రకటించింది. దీనితో బిఎస్ఎన్ఎల్ నష్టాలు 5,370 కోట్ల రూపాయల నుంచి 2, 247 కోట్ల రూపాయలకు తగ్గాయని ప్రకటించింది. 5 జి,4 జి నెట్వర్క్ విస్తరణ పై దృష్టి పెట్టడంతోనే ఈ లాభాలు వస్తున్నట్లు పేర్కొంది. అలాగే సరసమైన ధరలకు ఆఫర్లు ఇవ్వటం తమ కంపెనీకి కలిసి వచ్చిందని బిఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్