Wednesday, February 4, 2026 01:19 PM
Wednesday, February 4, 2026 01:19 PM

ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును వెలికితీసిన అధికారులు

ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును ఇంజనీర్లు తొలగించారు. గేట్ల వద్ద అడ్డుగా ఉన్న మూడు పడవలను ఇంజినీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి వెలికి తీశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును అధికారులు వెలికితీశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్‌ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్‌ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Read Also : ఏపీ టూ యూపీ… జగన్ కు బిగుస్తున్న ఉచ్చు

ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ బోట్లు, ఒక మోస్తరు పడవ గేట్ల వద్ద చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో ఈ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్​ అమలు చేసిన అధికారులు విఫలం అయ్యారు. దాదాపు 19 రోజుల ప్రయత్నాల అనంతరం రెండు పడవలను బయటకు తీశారు. తాజాగా ఇవాళ మూడో బోటును వెలికితీసి సఫలీకృతమయ్యారు. మరోవైపు నాలుగో పడవ కూడా ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్