Wednesday, February 4, 2026 09:50 PM
Wednesday, February 4, 2026 09:50 PM

లిక్కర్ అక్రమార్కుల బెండు తీస్తున్న ఏపీ సిఐడి

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా జరిగిన మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది. గత అయిదేళ్ళ నుంచి ఎవరికి మద్యం కాంట్రాక్ట్ లు ఇచ్చారు, ఏంటీ అనే దానిపై సర్కార్ సిఐడీ ద్వారా దర్యాప్తు చేయిస్తోంది. మద్యం కుంభకోణంలో అక్రమాలు వెలికితీయడమే లక్ష్యంగా మంగళవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద… తాడేపల్లి ప్యాలెస్ తో సన్నిహితంగా ఉన్న వాళ్ళకే 90 శాతం ఆర్డర్లు ఇచ్చారు. వైసీపీ నేతలతో అధికారులు చేతులు కలిపి అధిక కమీషన్ ఇచ్చిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బినామీ కంపెనీకి ఎక్కువగా ఆర్డర్ లు ఇచ్చారు. టీడీపీ వారి డిస్టిలరీలు లాక్కున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి తయారి ప్లాంట్ లేకపోయినా ఆర్డర్ లు ఇచ్చేసారు. 90 శాతం ఆర్డర్ లు కేవలం 10 సంస్థలకే దక్కాయి అని గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి వరకు సాగాయి తనిఖీలు. కరకంబాడి లోని ఎస్వీఆర్ డిస్టలరీస్, మురుకంబట్టు లోని కృష్ణ ఎంటర్ప్రైజెస్ లో సోదాలు నిర్వహించారు.

Also Read : చెల్లితో రాజీ లేదు.. షర్మిల చీటర్

2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు డిస్టలరీస్ లో ఏఏ కంపెనీలకు ఏఏ రకాల మద్యం ఎంత పరిణామంలో తయారు చేశారనే వివరాలు సేకరించారు. నెలవారీగా తయారు చేసిన మద్యం ఎంత మేర సరఫరా చేశారు, మిగిలిన స్టాక్ ఏం చేశారన్న దానిపై విచారణ చేసారు. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి తెప్పించారు, బ్లెండ్ ఎంత మోతాదులో కలిపారన్న దానిపై ఆరా తీసారు. డిస్టలరీస్ లో ఏ ఏ రకాల మద్యం తయారీకి అనుమతులు ఉన్నాయి, వాటికి అనుగుణంగానే తయారీ చేశారా లేక ఉల్లంఘన జరిగిందా ఆన్న వివరాలు కూడా సేకరించడం గమనార్హం.

5 ఏళ్ల కాలంలో మద్యం తయారీ విక్రయాల రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించిన అధికారులు… మద్యం తయారీ వేస్టేజ్ ఎంత, దాన్నేమి చేశారు, ధ్వంసం చేశారా లేదంటే మళ్ళీ చీప్ కింద విక్రయించారా ఆన్న దానిపై ఆరా తీసారు. సిఐడి సోదాలు, ఎంక్వైరీ ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు…డిస్టలరీస్ లీజు అంశాలను కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డికి చెందిన తయారి ప్లాంట్ లపై అధికారులు ఫోకస్ చేసారు. త్వరలోనే ఈ అంశంలో కీలక అరెస్ట్ లు ఉండే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్