Wednesday, May 6, 2026 08:58 PM
Wednesday, May 6, 2026 08:58 PM

సాక్షికి కోర్ట్ స్ట్రాంగ్ వార్నింగ్

రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలో… బిగ్ బ్లాస్ట్ అంటూ వైరల్ అయిన పోస్ట్ తర్వాత వైసీపీ పెద్ద ఎత్తున అదే స్థాయిలో ప్రచారం చేసింది. అయితే అనూహ్యంగా డ్రగ్స్ కేసుకి సంబంధించి టీడీపీ అనుకూల మీడియా అధినేతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వైసీపీ. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా షాక్ అయ్యారు. ఈ నేపధ్యంలో సాక్షి మీడియా, వైసీపీకి సిటీ సివిల్ కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల ప్రసారం చేసిన పలు కథనాలపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై సిటీ సివిల్ కోర్టులో టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ పిటీషన్ దాఖలు చేసారు. టీవీ5 ఎండీ రవీంద్రనాథ్‌పై రాసిన అసత్య వార్తా కథనాలను వెంటనే తొలగించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇకపై టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి వార్తలు రాయొద్దని కోర్టు ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టీవీ చైర్‌పర్సన్ భారతీ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కోర్టు విచారణ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : షర్మిలతో పోరాటం అంటే.. జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా?

సాక్షి పేపర్ చీఫ్ ఎడిటర్, ఎడిటర్ వెంటనే మీడియాలో ఉన్న కంటెంట్ తొలగించాలని ఆదేశించింది. గూగుల్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు వైసీపీ అనుకూల మీడియా గ్రేట్అంధ్రలో ఉన్న కంటెంట్లు వెంటనే తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై టీవీ5 ఎండీ రవీంద్రనాథ్‌పై ఎలాంటి అసత్య, అనుచిత కథనాలు రాయొద్దని స్పష్టం చేసింది కోర్ట్. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని సిటీ సివిల్ కోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్