Wednesday, August 5, 2026 02:54 AM
Wednesday, August 5, 2026 02:54 AM

టిటిడిపి అధ్యక్షుడిగా కీలక వ్యక్తి ఫైనల్..?

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు గత పదేళ్ళ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మానసికంగా బలహీన పడ్డారు. ఇక కెసిఆర్ కు భయపడిన వాళ్ళు పార్టీ మారి నేటి భారాస లో చేరిపోయారు. ప్రస్తుతం తెలంగాణా తెలుగుదేశంలో ఇమేజ్ ఉన్న నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో ఒక్కొక్కరు కాంగ్రెస్ లోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదనే కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.

దీనితో చంద్రబాబు ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కీలక నేతలు చాలా మంది ఆ పదవి కోసం చూస్తున్నారు. తెరాస నుంచి ఒక నేత పార్టీ మారే అవకాశం ఉందని ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసారని కూడా జనాల్లో టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు వలస నేతలని నమ్మే పరిస్థితి పార్టీలో లేదన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే… టీడీపీలో ఉన్న నేతకే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. సామాజిక న్యాయం విషయంలో ముందు ఉండే తెలుగుదేశం పార్టీ… కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది.

Also Read : తెలంగాణ టిడిపి పై బాబు సంచలన నిర్ణయం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్నూరి నర్సిరెడ్డికి బాధ్యతలు అప్పగించి ఆయన సారధ్యంలో గ్రేటర్ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యర్ధులకు గట్టిగా గుచ్చుకునేలా ఆయన సమాధానం చెప్పగలరు, దానికి తోడు మంచి వాగ్ధాటి ఉన్న నేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరుంది. అందుకే ఇప్పుడు ఆయనకు ఆ బాధ్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. దీనిపై చంద్రబాబు మాట్లాడినప్పుడు నర్సిరెడ్డి సానుకూలంగానే స్పందించారు అని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్