Wednesday, February 4, 2026 09:12 PM
Wednesday, February 4, 2026 09:12 PM

బెజవాడలో తగ్గని రద్దీ.. ఆశ్చర్యపోతున్న అధికారులు

విజయవాడలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించింది దేవదాయశాఖ. దేశం నలమూలాల నుంచి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో క్యూలైన్ లు భక్తులతో నిండిపోయాయి. ప్రతిరోజు సగటున లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణంగా గతంలో మూలా నక్షత్రం రోజున ఎక్కువగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అత్యంత ఆశ్చర్యం కలిగిస్తోంది. దసరా రోజున ఎలాగో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.

Also Read : యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ నుంచి ఈఎంఐ పేమెంట్..!

కానీ దసరా ముగిసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు వైపుల నుంచి అమ్మవారిని దర్శించుకునే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కానీ పండుగ తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో.. పోలీసులు ఎక్కడికి అక్కడ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి దసరా తర్వాత విరుముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భవానీ భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ భవాని భక్తులతో పాటుగా సాధారణ భక్తులు కూడా భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు.

Also Read : మిథున్ రెడ్డికి మద్దతు ఎక్కడ..? సైలెంట్ గా క్యాడర్..!

ఇక భవాని మాలలు ధరించి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేసింది దేవాదాయ శాఖ. కృష్ణా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునే వారికోసం కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దేవాదాయ శాఖ అంచనాల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో కనీసం 2 లక్షల 50 వేల నుంచి మూడు లక్షల మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు. దీనితో విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా మారాయి. ఈ స్థాయిలో తాము ఎప్పుడూ భక్తులను చూడలేదు అంటున్నారు విజయవాడ వాసులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్