Friday, September 12, 2025 05:14 PM
Friday, September 12, 2025 05:14 PM
roots

ఫేక్ బతుకులు.. వైసీపీపై లోకేష్ ఫైర్

తప్పుడు ప్రచారం చేసే విషయంలో వైసీపీ 2014 నుంచి ఏ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. రాజకీయంగా బలహీనపడిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2014 తర్వాత అలాగే 2024 తర్వాత తప్పుడు ప్రచారాలతో వైసీపీ రాజకీయం చేస్తుందని టిడిపి నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులపై కూడా వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైసీపీకి ఘాటు కౌంటర్ ఇచ్చారు. టీచర్లపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.

Also Read : ట్రంప్ తో ఏం మాట్లాడానో.. మోడీకి చెప్పా.. పుతిన్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్నారని.. వైసిపి ఓ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చిన ఫోటోను.. ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు చెప్పడం, దానిపై దారుణంగా వ్యాఖ్యానించడం క్షమించరాని నేరమని లోకేష్ మండిపడ్డారు. విద్యను నేర్పే గురువులు పైన అతినీచంగా వ్యవహరించిన వైసిపి నీతి బాహ్యమైన చర్యల్లో మరో మెట్టు కిందకి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : రాజీనామాకు సిద్ధమైన అక్క శిష్యులు..? గులాబీ పార్టీలో అలజడి

ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ.. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అతి నీచంగా.. చిత్రీకరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం చేసే వైసిపి చర్యలను అర్థం చేసుకొని తగిన రీతిలో స్పందించాల్సిందిగా టీచర్లను కోరుతున్నట్లు తెలిపారు. ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీచర్లు స్పందించకపోతే.. వైసిపి విద్యార్థుల భవిష్యత్తుతో పాటుగా టీచర్ల జీవితాలను కూడా నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్