Wednesday, February 4, 2026 11:22 PM
Wednesday, February 4, 2026 11:22 PM

పోటీ చేస్తున్నాం.. టీటీడీపీ కీలక ప్రకటన 

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయాణంపై ఎన్నో ఊహాగానాలు. దాదాపు ఆరు నెలల నుంచి.. పార్టీలో చేరబోయే నాయకులు, జిల్లా, మండల, రాష్ట్ర అధ్యక్ష పదవులు, నియోజకవర్గాల ఇంచార్జ్ పదవులు ఇలా ఏదోక చర్చ జరుగుతూనే ఉంది. ఏపీలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన ఫార్ములాను తెలంగాణాలో సైతం అమలు చేసే దిశగా ఎన్డియే అడుగులు వేస్తోంది అంటూ కథనాలు వచ్చాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్, స్థానిక సంస్థలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ ఇలా చాలా ప్రచారాలు జరిగాయి.

Also Read : టీసీఎస్ నిర్ణయం వెనుక కారణం అదేనా..?

ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉప ఎన్నికపైనే టీడీపీ ఫోకస్ చేసిందని, కొన్ని కారణాలతో బిజేపి పక్కకు తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి వాసిరెడ్డి రామనాథం కీలక ప్రకటన చేసారు. రాబోయే తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందన్నారు. మధిరలో మాట్లాడిన ఆయన.. తెలంగాణాలో టీడీపీ ఇంకా బలంగానే ఉందని, గెలుపోటములపై ప్రభావం చూపించే స్థితిలో ఉందని వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పోటీలో నిలుస్తుంది అన్నారు.

Also Read : దేశాధినేతను లేపేస్తాం.. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ద మేఘాలు

అవసరమైతే ఇతర పార్టీలతో పోత్తులకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా చూస్తే తెలంగాణాలో టీడీపీ స్థానిక సంస్థల్లో పోటీ చేసి, ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ లను నియమించే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లో బిజేపితో కలిసి వెళ్లి.. అక్కడ ఫలితాల ఆధారంగా కూడా ఇంచార్జ్ లను నియమించే సూచనలు కనపడుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ నాయకులను కూడా చేర్చుకునే అవకాశాలు స్థానిక సంస్థల తర్వాతనే ఉండవచ్చు అని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్