Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

కాంగ్రెస్‌తో గొంతు కలిపిన జగన్

దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాల డీలిమిటేషన్ విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అధికార పార్టీ డిఎంకె దీనిపై పెద్ద పోరాటమే చేస్తుంది. తాజాగా ప్రతిపక్ష పార్టీలతో సీఎం స్టాలిన్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటుగా పలువురు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది ప్రతిపక్ష పార్టీల వాదన.

Also Read : హైదరాబాద్ లో కుస్తీ తమిళనాడులో దోస్తీ

ఇక తాజాగా దీనికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా గొంతు కలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘాటుగా లేఖ రాశారు జగన్. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గాలని.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని జగన్ కోరారు. 2026 లో జరిగే డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొందని.. ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతుందన్నారు. గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే తగ్గింది అని పేర్కొన్నారు.

Also Read : కేసీఆర్ సంచలన కామెంట్స్.. చంద్రబాబుపై కూడా..!

ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ మెడిటేషన్ చేస్తే ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గుతాయని.. డీ లిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాలలో అణిచివేసే పార్టీ బిజెపి అని.. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందన్నారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందన్నారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు జగన్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్