బూతులు తిట్టడంలో వైసిపి నేతలు ఎప్పుడో పిహెచ్డీలు చేశారు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళకే చెల్లింది. పదవులను గౌరవించకుండా, వైసిపి నాయకులు మాట్లాడే మాటలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు కూడా బూతులు మాట్లాడుతుంటారు. ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ విషయంలో వారు మాట్లాడే మాటలు దారుణం.
Also Read : చివరి కోరిక తీరకుండా కన్నుమూసిన అజిత్ పవార్..?
తాజాగా గుంటూరులో జరిగిన ఘటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు తల్లిని అవమానిస్తూ అత్యంత అసభ్యకరంగా మాట్లాడాడు అంబటి రాంబాబు. కల్తీ నెయ్యికి సంబంధించిన పోస్టర్ ను చించడానికి వెళ్లిన అంబటి రాంబాబును, పోలీసులు అడ్డుకోవడంతో భూతల దండకం అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : అజిత్ మృతి.. బీజేపీకి గోల్డెన్ ఛాన్స్..!
అయితే అంబటి రాంబాబు విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం, రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తామని టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, హోం మంత్రి అనిత ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని డిజిపి కి ఆదేశాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు కార్యకర్తలు. కామన్ మ్యాన్ కిరణ్ విషయంలో దూకుడుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం, మరి అంబటి రాంబాబు విషయంలో ఏం చేస్తుందో, త్వరగా చేయాలని.. సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడితే, ఉపేక్షిస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు తమ సొంత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

