అలంకార ప్రాధాన్యత లోహాలలో బంగారానికి భారతీయులు ఇచ్చే ప్రాధాన్యత వేరు. బంగారపు వెలుగుల్లో రాజసాన్ని చూసుకునే భారతీయులకు ఇప్పుడు ఆమడ దూరానికి జరుగుతోంది. ఓణీల ఫంక్షన్ మొదలు అమెరికా అధ్యక్ష భవనం వరకు ఉన్న పరిణామాలతో బంగారం ధర లక్షల్లో పెరిగిపోతుంది. దేశీయంగా ఉన్న డిమాండ్ పెరగడం, ముహూర్తాలు రావడంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంపై పెట్టిన ఖర్చు వృధా కాదు అని నిరూపిస్తోంది పసిడి.
Also Read : మహాపాపం పై రాష్ట్రమంతటా సంచలన ఫ్లెక్సీలు ..!
ఈ ఏడాది ప్రారంభం నుంచే భారత మహిళల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. అసలు ఎందుకు ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈ వారం, అంతర్జాతీయంగా బంగారం ధర మునుపటి రికార్డులను బద్దలు కొట్టి, ఔన్సుకు 5,500 డాలర్లు దాటింది. పెట్టుబడి ప్రపంచంలో, బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా పిలుస్తారు. రాజకీయ ఇబ్బందులు లేదా వాణిజ్య యుద్ధాలు తలెత్తినప్పుడు, పెట్టుబడిదారుల స్టాక్ లు, కరెన్సీల విలువ గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రధాన దేశాల మధ్య ఘర్షణకు ఆజ్యం పోసే కొత్త సుంకాల నేపధ్యంలో, ప్రజలు తమ నిధులను బంగారంలోకి మారుస్తున్నారు.
Also Read : వరల్డ్ కప్ కు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్..!
కాగితం రూపంలో ఉండే డబ్బు ప్రమాదకరంగా భావించినప్పుడు.. దాని విలువను కలిగి ఉండే భౌతిక ఆస్తి బంగారం. జెపి మోర్గాన్ ప్రకారం , వ్యక్తులు మాత్రమే బంగారం కొనడం లేదు. ప్రభుత్వాలు కూడా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. చైనా, భారత్ వంటి దేశాలలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను వైవిధ్యపరిచేందుకు భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఎక్కువ బంగారం, తక్కువ అమెరికా డాలర్లను కలిగి ఉండటం ద్వారా, ఈ దేశాలు అమెరికన్ కరెన్సీలో హెచ్చుతగ్గుల నుండి తమ ఆర్థిక వ్యవస్థలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు లేదా తగ్గుతాయని భావించినప్పుడు, సేవింగ్స్ అకౌంట్స్ నుంచి కస్టమర్ లకు వెళ్ళే వడ్డీలు తగ్గుతాయి. బంగారానికి వడ్డీతో సంబంధం లేకుండా విలువ పెరుగుతుంది కాబట్టి.. బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

