Saturday, March 21, 2026 11:57 PM
Saturday, March 21, 2026 11:57 PM

మహాపాపం పై రాష్ట్రమంతటా సంచలన ఫ్లెక్సీలు ..!

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటుైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన అనంతరం, లడ్డుల తయారీలో ఉపయోగించిన నెయ్యి అసలు సంప్రదాయ పద్ధతుల్లో తయారు కాలేదని SIT స్పష్టంగా తేల్చింది. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో సంబంధం లేకుండా రసాయనాల సహాయంతో నెయ్యిని తయారు చేసి ప్రసాదాల తయారీలో వినియోగించినట్టు గుర్తించింది. ఈ వ్యవహారం తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి తీవ్ర మచ్చగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Maha Papam Kalti laddu

SIT నివేదిక ప్రకారం, ఈ కేసులో నిందితుల పాత్ర అత్యంత కీలకమైందిగా ఉంది. దాదాపు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసినట్టు, అదే నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డులు తయారయ్యాయని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని, సుమారు రూ.251 కోట్ల మేరకు నిధులు అక్రమంగా మళ్లించబడ్డాయని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యి వాడటం ద్వారా ప్రజారోగ్యానికి, భక్తుల విశ్వాసాలకు తీవ్ర భంగం కలిగిందనే అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Also Read : బ్రేకింగ్: కేసీఆర్ కు సిట్ నోటీసులు

ఇంతటి తీవ్రమైన ఆరోపణలు, SIT వెల్లడించిన వాస్తవాలు ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ నాయకత్వం మాత్రం ఏమీ జరగనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరి హిందూ వాదులు, భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. గత ఐదేళ్లుగా తాము అసలు నెయ్యి లేకుండానే ప్రసాదం స్వీకరించామని తెలుసుకుని భక్తులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, నైతికంగా కూడా క్షమించరాని తప్పిదమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

TDP Posters On Laddu Scam By Ysrcp

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన స్వరం మరింత బలపడుతోంది. పిడుగురాళ్లతో పాటు విజయవాడలోని పటమట ప్రాంతంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, SIT ప్రస్తావించిన అంశాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. “అది నెయ్యే కాదు” అనే శీర్షికలతో పత్రికల్లో వచ్చిన కథనాలను జత చేస్తూ, దీనిని “మహా పాపం”గా అభివర్ణిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలలో జగన్ మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలను ప్రస్తావిస్తూ బాధ్యత నిర్ధారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ఈ వ్యవహారాన్ని మరింత ప్రజా చర్చలో నిలిపాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్