ప్రజల్లోకి వెళ్లేందుకు కష్టపడుతోన్న భారత రాష్ట్ర సమితికి ఇటీవలి పరిణామాలు తలనొప్పిగా మారాయి. తాజాగా పైలెట్ రోహిత్ రెడ్డి వ్యవహారంతో అధిష్టానం విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక ఈ కేసు విషయంలో పైలట్ రోహిత్ రెడ్డికి ఓ వైపు ఉచ్చు బిగుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరో వైపు.. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో, పార్టీ అధినేత కేసీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు కేసీఆర్.
Also Read : వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!
మీడియాలో వస్తున్న డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టమైన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే, పార్టీ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని నోటీసులో హెచ్చరించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సమాజంలో ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల పార్టీ క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అధిష్టానం భావిస్తోంది.
Also Read : అమరావతిలో అమరజీవికి అద్బుత నివాళి..!
గతంలో కూడా రోహిత్ రెడ్డి పేరు బెంగళూరు డ్రగ్స్ కేసులో మరియు ఇతర దర్యాప్తు సంస్థల విచారణలో వినిపించింది. అయితే, తాజాగా మీడియాలో వస్తున్న కథనాలు, దర్యాప్తు సంస్థల కదలికల నేపథ్యంలో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షోకాజ్ నోటీసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్ రెడ్డి ఈ నోటీసుపై ఎలా స్పందిస్తారు? ఆయన ఇచ్చే వివరణతో కేసీఆర్ సంతృప్తి చెందుతారా? లేదా ఆయనపై వేటు పడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైలెట్ రోహిత్ రెడ్డి ఇప్పటికే రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

