ఈ రోజుల్లో.. వాట్సాప్ అనే ఆన్లైన్ మెసేజింగ్ యాప్ లేకపోతే ఏ కార్యక్రమం జరగని పరిస్థితి. సోషల్ మీడియాలో అత్యంత ఫేమస్ అయిన ఈ ఫ్లాట్ ఫాం ఇప్పుడు భద్రత విషయంలో ఆందోళన కలిగిస్తోంది. ఐటీ కంపెనీలు ఇప్పుడు వాట్సాప్ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ.. తమ సిబ్బంది ఆపిల్ ఫోన్ లు వాడాలనే సూచనలు కూడా చేస్తోంది. ఐమెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయాలని సూచనలు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఘోస్ట్ పెయిరింగ్ అనే మాట సామాన్య యూజర్లను సైతం కంగారు పెడుతోంది. ఈ నేపధ్యంలో వాట్సాప్ కు ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు నిపుణులు.
Also Read : అమెరికన్ల ఉద్యోగాలపై జేడి వాన్స్ సంచలనం..!
టెలిగ్రాం
సెక్యూరిటీ పరంగా వాట్సాప్ కంటే టెలిగ్రాం చాలా బెటర్ అనే మాట వినపడుతోంది. ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్, గ్రూప్ చాట్ సెక్యూరిటీ, ఛానల్ సెక్యూరిటీ వంటివి అందిస్తోంది.
హైక్
హైక్ అనేది ఒక భారతీయ మెసేజింగ్ యాప్, స్టిక్కర్ ప్యాక్లు, న్యూస్ అలర్ట్లు, క్రికెట్ స్కోర్లు, డిజిటల్ వాలెట్ సర్వీస్ వంటి అద్భుతమైన ఫీచర్లు అందిస్తోంది.
జియో చాట్
జియో నెట్వర్క్ లో ఇప్పటికే ఉన్న వినియోగదారులకు మెరుగైన, అనుకూలమైన మెసేజింగ్, వాయిస్/వీడియో కాల్స్, ఫైల్ షేరింగ్, స్టిక్కర్లు, ఛానెల్స్ వంటి ఫీచర్స్, జియో ఎకో సిస్టంతో కనెక్ట్ చేసిన కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. దీనికి కూడా సెక్యూరిటీ ఎక్కువే.
Also Read : భారత రాష్ట్ర సమితి పేరు మారుతోంది..?
సిగ్నల్
అత్యధిక సెక్యూరిటీ ఉన్న యాప్స్ లో ఇది కూడా ఒకటి. చాట్ తో పాటుగా కాల్స్ కి కూడా సెక్యూరిటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రొఫెషనల్ గా ఉండే ఈ యాప్ ను చాలా మంది ఇప్పటికే వాడుతున్నారు.
వైబర్
సెక్యూరిటీ పరంగా వాట్సాప్ కంటే ముందే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. చాట్, కాల్స్, మీడియా సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

