Friday, September 12, 2025 03:33 PM
Friday, September 12, 2025 03:33 PM
roots

టీ బీజేపీలో కలకలం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు కాషాయ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీని ముందుండి నడిపించే నేత ఎంపిక ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎంపిక జరుగుతోంది. ఇందుకోసం ఎన్నికల అబ్జర్వర్‌లను కూడా పార్టీ ఢిల్లీ పెద్దలు నియమించారు. వీరి ఆధ్వర్యంలోనే అధ్యక్షుని ఎంపిక జరుగుతోంది. పేరుకే ఎన్నిక అయినప్పటికీ.. ప్రక్రియ అంతా ఏకగ్రీవమే. పార్టీ హై కమాండ్ నుంచి వచ్చిన సీల్డ్ కవర్‌లో ఉన్న నేత రాష్ట్ర అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టనున్నారు. అంతే తప్ప.. ఈ నామినేషన్ ప్రక్రియ అంతా పేరుకే. అయితే ఈ అధ్యక్ష ఎన్నిక పట్ల పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : బాబుతో సమావేశానికి డుమ్మా కొట్టిన నాయకులు వీరే..?

తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులను మారుస్తోంది. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ పురంధేశ్వరి ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఎన్నికల ప్రక్రియ చేపడుతున్నట్లు ఢిల్లీ పెద్దలు వెల్లడించారు. ఇందుకోసం ఈ రోజు నామినేషన్లు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత.. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తే.. రేపు ఎన్నిక నిర్వహిస్తారు. కానీ ఇదంతా కేవలం పైకి మాత్రమే. రాష్ట్ర పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయం ఇప్పటికే పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

Also Read : మహా న్యూస్ పై దాడి వెనుక వైసీపీ హస్తం..?

తెలంగాణలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుకు, ఏపీ బాధ్యతలను మాధవ్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాధవ్ ఎంపిక విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రామచందర్ రావు విషయంలో పలువురు నేతలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే తన అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రస్తుత అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లే పార్టీలో ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికే పార్టీ ఆఫీసుకు తాను వచ్చినట్లు తెలిపారు. అయితే తన మద్దతుదారులను కొంతమంది బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్