Wednesday, February 4, 2026 10:04 PM
Wednesday, February 4, 2026 10:04 PM

కుప్పం బాధ్యత నాది.. ఆకట్టుకున్న భువనేశ్వరి ప్రసంగం

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని… కాబట్టి పట్టుదలగా అందరూ కష్టపడి చదువుకోవాలని సూచించారు ఆమె. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని, మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు. విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయన్నారు.

నేను మీలాగే సరదాగా గడిపానని… కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటూ ఉండగా 19 ఏళ్లకే పెళ్లి చేశారని… నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు గారు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారని ఒక చాలెంజ్ గా తీసుకుని పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆటపాటలే కాదు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని… విజయం ఊరికే ఏమీ రాదు..కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదన్నారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉన్నత స్థానాలకు మనం చేరుకోగలమని పిలుపునిచ్చారు.

Also Read : ఫైబర్ నెట్ లో దారుణాలు.. జీవీ రెడ్డి సంచలన కామెంట్స్

కుప్పం అభివృద్ధి గురించి మాట్లాడిన ఆమె… చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారన్నారు. ప్రజలకు సేవ చేయాలని తపిస్తారని… ఇప్పుడు స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళుతున్నారని కొనియాడారు. పేదరికం లేని సమాజమే ఆయన లక్ష్యమన్నారు. చంద్రబాబు గారిని సొంత బిడ్డగా భావిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేమని… రాబోయే ఐదేళ్లలో కుప్పం ను అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నానన్నారు. కుప్పం అభివృద్ధి బాధ్యత తనదని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్