Wednesday, February 4, 2026 11:16 AM
Wednesday, February 4, 2026 11:16 AM

జగన్ కు ఏం దొరకడం లేదా..? అందుకే పాత రాగం..!

మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథ్యంలోని వైసీపీ పదేపదే విమర్శలు చేయడం ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఇటీవల జగన్ మాట్లాడిన మాటలతో.. పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ స్వయంగా జోక్యం చేసుకోవడంతో కొంత మార్పు కనపడుతుంది. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా జోక్యం చేసుకోవడం.. పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్లతో మాట్లాడటం వంటివి జరుగుతున్నాయి.

Also read : ఏపీలో ఇప్పటికీ కొనసాగుతున్న వైఎస్ జగన్ పాలన..!

అయితే గత మూడు నెలల నుంచి వైసీపీ ఇదే అంశంపై విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు వైసిపికి మరో అంశం దొరకకపోవడమే ఈ అంశంపై విమర్శలు చేయడం కారణం అనే కామెంట్స్ వినపడుతున్నాయి. అటు ప్రజా ఉద్యమంలో విషయంలో కూడా వైసిపి పెద్దగా ముందుకు రావడం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి విమర్శలు చేయాలని భావించినప్పటికీ.. ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో వైసిపి ఈ అంశం మీద మాత్రమే ముందుకు వెళుతుంది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ జగన్ మాత్రం వదలడం లేదు.

Also read : ఇది కూడా సీబీఐకే..? రేవంత్ సంచలన నిర్ణయం..?

అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో వెనక్కి తగ్గకపోవడం.. ఎలాగైనా సరే ఈ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని భావించటం కొంత రాజకీయాన్ని వేడెక్కించింది. అయితే ఈ అంశంలో జగన్ లేదంటే కొంతమంది వైసిపి నేతలు మినహా మిగిలిన నాయకులు పెద్దగా స్పందించడం లేదు. అటు సోషల్ మీడియాలో సైతం వైసీపీ క్యాడర్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగాలకు ఎక్కువగా వైసీపీ ప్రాధాన్యత ఇస్తుంది. దీనితో వైసిపి సోషల్ మీడియా లో ఈ పి పిపీ విధానం మరుగున పడిపోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

పోల్స్