Wednesday, February 4, 2026 09:26 AM
Wednesday, February 4, 2026 09:26 AM

రూటు మార్చేసిన అన్న.. మీడియా ముందుకు వాళ్ళే..!

వైసీపీ అనగానే చాలా మందికి కనపడేది, వినపడేది ఆ పార్టీ నాయకులు కొందరు చేసే చేష్టలు, మాట్లాడే మాటలు. రాజకీయంగా బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా సరే వారి వైఖరిలో గాని, స్టైల్ లో గాని మార్పు ఉండదు. ఎవరు ఎన్ని బూతులు మాట్లాడితే, ఎవరు ఎంత వివాదాస్పదంగా వ్యవహరిస్తే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది అంటారు విశ్లేషకులు. అందుకే కొడాలి నానీ, జోగి రమేష్, ఆర్కే రోజా, గోరంట్ల మాధవ్ వంటి వారు కీలక పదవులు అధిరోహించారు అనేది అక్షర సత్యం.

Also Read : సీనియర్ దూకుడుకు తెలుగు తమ్ముళ్ల బ్రేకులు

ఆ పార్టీ రాజకీయ చరిత్ర, భవిష్యత్తు మొత్తం ఈ తరహా నేతల అడుగులు, చప్పుళ్ళే కనపడతాయి, వినపడతాయి. 2024లో సౌండ్ కాస్త తగ్గి.. సినిమా స్లో మోషన్ లో నడుస్తున్నప్పటికీ.. ఛాన్స్ వస్తే చెలరేగిపోవడానికి రెడీగా ఉన్నారు ఎందరో. కానీ ఇప్పుడు రూట్ మార్చేందుకు అధినేత రెడీ అయ్యారు. వాళ్లకు రెస్ట్ ఇచ్చి.. సాఫ్ట్ క్యారెక్టర్ లను ప్రజలకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. సబ్జెక్ట్ ఉన్న నాయకులకు అధికార ప్రతినిధి పదవులు, ఇతర కీలక పదవులు ఇవ్వడానికి జగన్ రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : సొంత నిర్ణయాలు లేవ్.. ముగ్గురు ఐఏఎస్ లపై పవన్ ప్రశంశలు..!

సాధారణంగా వైసీపీ మినహా ఇతర పార్టీల నాయకులు గానీ పదవుల్లో ఉన్న వారు గానీ.. సబ్జెక్ట్ తో అంటే లెక్కలతో మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది కార్యకర్తలకు, సోషల్ మీడియాలో ఉండే అభిమానులకు పోరాడేందుకు అవకాశం ఇస్తుంది. బూతులతో మీడియా సమావేశాలు పెడితే ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన జగన్.. ఈ పరిస్థితి సరి కాదని, సాఫ్ట్ క్యారెక్టర్ లను ముందుకు తెచ్చి, లెక్కలతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించి, విమర్శలు చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆ తరహా నాయకులతో జగన్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్