జాతీయ పార్టీల్లో ముఖ్యమంత్రి పదవి అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కీలక నాయకులు.. ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పార్టీ కోసం కష్టపడ్డాము అనే కారణంతో అధిష్టానాలను బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే సమయంలో సామాజిక వర్గ సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి వ్యవహారం సంచలనం అవుతోంది. సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీలో కీలక నాయకత్వ డిమాండ్ లు ఇలా ఆసక్తిని రేపుతున్నాయి.
Also Read : మొంథా తుపాను తో వ్యవసాయ రంగానికి అపార నష్టం
ఈ నేపధ్యంలో కర్ణాటక వ్యవహారంలో తాజాగా జాతీయ మీడియా సంచలన విషయాలు వెల్లడించింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో నిర్ణయాన్ని.. డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి వదిలేసినట్లు పేర్కొంది. ఇదే సమయంలో.. తాను అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడెందుకు కూడా సిద్దంగా ఉన్నాను అని అధిష్టానానికి చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి డీకే శివకుమార్ తో.. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఆసక్తికర కామెంట్ చేసినట్లు సమాచారం.
Also Read : ఆ నేతకు అండగా “కాపు” కాస్తోంది ఎవరు..?
రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని మీడియాతో సిద్దరామయ్య కామెంట్ చేసినట్లు సమాచారం. అసలు ముఖ్యమంత్రి పదవి విషయంలో రగడ అనేది మీడియా సృష్టి మాత్రమే అని చెప్పినట్లు కూడా జాతీయ మీడియా పేర్కొంది. 2028 ఎన్నికలపై దృష్టి పెట్టడానికి తగినంత సమయం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి తీసుకు రావడమే తమ లక్ష్యమని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బిజెపి గేమ్ ఆడేందుకు సిద్దంగా ఉండటంతో సిద్దరామయ్య ఒకింత ఒత్తిడిలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

