Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

కేటిఆర్ కు ఒకే రోజు రెండు షాక్ లు…!

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఇప్పట్లో వదిలేలా కనబడటం లేదు. ఒకేరోజు ఆయనకు రెండు షాక్ లు తగిలాయి. ఈరోజు ఉదయం హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఈడి జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి నేడు కేటీఆర్ ను విచారించాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని కేటిఆర్ తెలిపారు.

Also Read : ఏపి కేబినేట్ లో భారీ మార్పులు ఖాయం..?

మీరు ఏసీబీ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు… కాబట్టి హైకోర్టులో విచారణ జరిగే వరకు వేచి చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు ఇక నేడు ఉదయం తెలంగాణ హైకోర్టు దానిపై కీలక నిర్ణయం తీసుకోవడంతో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఈనెల 16న విచారణ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఈడీ నుంచి నోటీసులందాయి. ఎఫ్ యు కు కట్టబెట్టిన 55 కోట్ల వ్యవహారం పై ఈడీ విచారణ చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.

Also Read : వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్

ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై కేటీఆర్ ను ఈడి అధికారులు ప్రశ్నిస్తారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ ను ఈడి నమోదు చేసింది. వారం క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా హైకోర్టు వ్యవహారం తేలిపోవడంతో మరోసారి నోటీసులు పంపించింది. ఇక కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా ఏసీబీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక మరోసారి ఆయన ఈనెల 9న విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. దీనితో ఆయనను అరెస్టు చేయడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయడంతో కేటీఆర్ అరెస్టు దాదాపు ఖాయంగా కనపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్