Sunday, March 22, 2026 06:58 PM
Sunday, March 22, 2026 06:58 PM

కేటిఆర్ కు ఒకే రోజు రెండు షాక్ లు…!

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఇప్పట్లో వదిలేలా కనబడటం లేదు. ఒకేరోజు ఆయనకు రెండు షాక్ లు తగిలాయి. ఈరోజు ఉదయం హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఈడి జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి నేడు కేటీఆర్ ను విచారించాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని కేటిఆర్ తెలిపారు.

Also Read : ఏపి కేబినేట్ లో భారీ మార్పులు ఖాయం..?

మీరు ఏసీబీ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు… కాబట్టి హైకోర్టులో విచారణ జరిగే వరకు వేచి చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు ఇక నేడు ఉదయం తెలంగాణ హైకోర్టు దానిపై కీలక నిర్ణయం తీసుకోవడంతో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఈనెల 16న విచారణ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఈడీ నుంచి నోటీసులందాయి. ఎఫ్ యు కు కట్టబెట్టిన 55 కోట్ల వ్యవహారం పై ఈడీ విచారణ చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.

Also Read : వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్

ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై కేటీఆర్ ను ఈడి అధికారులు ప్రశ్నిస్తారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ ను ఈడి నమోదు చేసింది. వారం క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా హైకోర్టు వ్యవహారం తేలిపోవడంతో మరోసారి నోటీసులు పంపించింది. ఇక కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా ఏసీబీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక మరోసారి ఆయన ఈనెల 9న విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. దీనితో ఆయనను అరెస్టు చేయడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయడంతో కేటీఆర్ అరెస్టు దాదాపు ఖాయంగా కనపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్