Wednesday, February 4, 2026 05:54 PM
Wednesday, February 4, 2026 05:54 PM

ఇదేం ప్రెస్ మీట్ అన్న..? షాక్ అవుతున్న జర్నలిస్ట్ లు

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం, విలేఖర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అనేది మనం సహజంగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాలపై విమర్శలు చేయడానికి మీడియాను ఎక్కువగా వాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ వ్యవహారశైలి దీనికి చాలా భిన్నంగా ఉంది. 2019 కు ముందు మీడియాతో ఎంతో స్వేచ్చగా మాట్లాడిన జగన్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు.

Also Read : వైసీపీకీ టీడీపీ భరోసా..!

రాసి ఇచ్చిన వాటినే ప్రసంగించడం మాత్రమే జగన్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే జరుగుతోంది. సాధారణంగా మీడియా సమావేశాల్లో విలేఖర్లు అడిగే ప్రశ్నలు ఉంటాయి. కాని జగన్ సమావేశంలో రాసి ఇచ్చిన ప్రసంగం చదవడం మాత్రమే ఉంటుంది. తాను తిట్టాలి అనుకున్నవి తిట్టడం ఒకటి అయితే, జగన్ ను ప్రశ్నలు అడిగే జర్నలిస్ట్ లు ఒక్కరు కూడా మీడియాలో కనపడకపోవడం గమనార్హం. అసలు ఏ ఛానల్ ప్రతినిధులు ఉన్నారో కూడా ఎవరికి అర్ధం కాని పరిస్థితి.

Also Read : లోకేష్ అదుర్స్.. వార్ రూమ్ లోనే మంత్రులు

ఇక మీడియా సమావేశానికి జర్నలిస్ట్ లను ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. కానీ, జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఓ లైవ్ లింక్ ను ముందుగా పంపిస్తారు. స్థానిక జర్నలిస్ట్ లకు గాని వేరే ఏ ఒక్కరికి సమాచారం ఉండదు. వైసీపీ అనుకూల మీడియాలో ఆ లింక్ ప్లే కావడం చూస్తూనే ఉంటాం. తాజాగా జరిగిన మీడియా సమావేశం కూడా దాదాపుగా అలాగే ఉంది. ఇక ఆ వీడియో కూడా వైసీపీ కార్యకర్తలకు బిట్ లు గా కట్ చేసి పంపించడం వంటివి జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్