ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన నేపధ్యంలో తాజాగా పరిశోధకులు సంచలన విషయాలను వెల్లడించారు. వారం రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే కలిగే లాభాలను బయటపెట్టారు. ఇటీవలి అధ్యయనంలో ఒక వారం పాటు సోషల్ మీడియా వాడకాన్ని నిలిపివేయడం వల్ల యువతలో ఆందోళన, నిరాశ, నిద్రలేమి తగ్గుతాయని, అదే సమయంలో వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందని తేలింది. సోషల్ మీడియా వాడకం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read : షమీ వచ్చేస్తున్నాడు.. బీసీసిఐ కీలక ప్రకటన..?
జామా నెట్వర్క్ లో ప్రచురించిన కథనంలో ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో సంచలన విషయాలు గుర్తించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో అసోసియేట్ ప్రొఫెసర్, బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ లో డిజిటల్ సైకియాట్రీ విభాగం డైరెక్టర్ జాన్ టోరస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అధ్యయనం కోసం, పరిశోధకులు 18, 24 సంవత్సరాల మధ్య వయస్సు గల 373 మందిని వినియోగించారు. వీరిలో 277 మంది అమ్మాయిలు, 73 మంది పురుషులు, 12 మంది నాన్-బైనరీ, 9 మంది ట్రాన్స్జెండర్లు ఇతరులు ఇద్దరు ఉన్నారు.
మొదటి రెండు వారాల్లో, పాల్గొనేవారు సాధారణంగా ఉపయోగించే విధంగానే సోషల్ మీడియాను ఉపయోగించారు. పరిశోధకులు పాల్గొనేవారి ఫోన్ల నుండి వారి సోషల్ మీడియా వినియోగం గురించి సమాచారాన్ని రికార్డ్ చేశారు. రెండు వారాల తర్వాత, పరిశోధకులు పాల్గొనేవారితో డేటాను పంచుకున్నారు, నిరాశ, ఆందోళన, నిద్రలేమి మరియు ఒంటరితనం లక్షణాల కోసం ప్రశ్నాపత్రాలను ఇచ్చారు.
Also Read : జిల్లా ఏర్పాటు సరే.. మరి వాటి సంగతి..?
తరువాత పాల్గొనేవారిని వారం రోజుల పాటు సోషల్ మీడియా డిటాక్స్ ప్రయత్నించాలనుకుంటున్నారా అని అడిగారు. అందులో 80 శాతం మంది డిటాక్స్ ను ఎంచుకున్నారు. డీటాక్స్ సమయంలో, సోషల్ మీడియా వాడకం 30 నిమిషాలకు తగ్గించారు. వారం చివరి నాటికి, ఆందోళన లక్షణాలలో 16% తగ్గింపు, నిరాశ లక్షణాలలో 24% తగ్గింపు, నిద్రలేమి లక్షణాలలో 14.5% తగ్గింపును గుర్తించారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత.. పాల్గొన్న వారు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పుడే బాగుందని చెప్పారట.

