Wednesday, February 4, 2026 05:56 PM
Wednesday, February 4, 2026 05:56 PM

భారత్ ఆయిల్ కొనడం లేదు.. ట్రంప్ సంచలన కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి భారత్ తో పాటుగా పలు దేశాలకు పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ నిర్ణయం అమెరికా ప్రభుత్వం తీసుకుంటుందో అర్ధం కాక ఎన్నో దేశాలు ఆందోళనలో ఉన్నాయి. గత నెలలో భారత్ పై ట్రంప్ సుంకాల దాడి చేసిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది అనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యాకు భారత్ నిధులు సమకూర్చి ఉక్రెయిన్ పై పోరాటానికి మద్దతు ఇస్తోందని ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

Also Read : కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న జీఎస్టీ..?

ఇక తాజాగా ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేసిందని ట్రంప్ సంచలన కామెంట్స్ చేసారు. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే రష్యాపై ఆంక్షలు విధించడంతోపాటు, ఆ దేశం నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే.

Also Read : ఆ పార్టీ భవిష్యత్తు తేల్చేసిన ఉండవల్లి..!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే మొదటి రెండు దేశాలు చైనా, భారత్. 40 శాతం ఆయిల్ ను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాలతో రష్యా విషయంలో భారత్ వెనక్కు తగ్గిందని ట్రంప్ కామెంట్ చేసారు. ఇక తాను భారత్ పై సుంకాలు విధించే అవకాశం లేదన్నారు ట్రంప్. ట్రంప్ చర్యల తర్వాత భారత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధి కర్మాగారాలు రష్యన్ ముడి చమురు కొనుగోలును నిలిపివేసాయని బ్లూమ్‌ బెర్గ్ వెల్లడించింది. అయితే ఈ విషయంలో కేంద్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్