గత కొన్నాళ్ళుగా వరల్డ్ సినిమాలో సౌత్ ఇండియన్ సినిమా సత్తా చాటుతోంది. మూస కథలతో బాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలు చేస్తూ ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న సమయంలో సౌత్ నుంచి చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. దీపావళికి మన సౌత్ నుంచి మూడు ఫేమస్ సినిమాలు విడుదల కాగా మూడూ విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వచ్చిన క, లక్కీ భాస్కర్ సినిమాలు, తమిళంలో విడుదలైన అమరన్ సినిమా మంచి హిట్ కొట్టాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.
దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. మధ్య తరగతి బ్యాంకు ఉద్యోగి పడే కష్టాలను చాలా బాగా చూపించారు. 1990 ల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ ను షేక్ చేసిన ఓ ఉదంతం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మెప్పించింది. భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది ఈ సినిమా. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన క సినిమా కూడా అంచనాలను అందుకుంది. తెలుగులో అసలు ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ లో సినిమా విడుదల కాలేదు. అందుకే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి.
Also Read : కెన్యా మృగాల మధ్యన జక్కన్న
పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం రిలీజ్ చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఈ యువ హీరో రేంజ్ పెరిగినట్టే. ఇక శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన అమరన్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. కార్గిల్ యుద్దంలో ప్రాణాలు అర్పించిన వీర మేజర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో ఓ సైనికుడి కష్టాలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఇలా ఈ మూడు సినిమాలు దీపావళి కానుకగా ప్రేక్షకులను అలరించాయి.

