ఇంగ్లాండ్ పర్యటనలో భారత కెప్టెన్ గా శుభమన్ గిల్ అదిరిపోయే ప్రదర్శన చేసాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడు. భారత్ చిన్న చిన్న తప్పులు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా 4-1 తో సీరీస్ గెలిచేది అనే మాట వాస్తవం. కెప్టెన్ గా గిల్ కు ఇది సక్సెస్ స్టోరీనే. దీనితో అతను మిగిలిన రెండు ఫార్మాట్ లకు కూడా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నాడని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఓ కథనం హాట్ టాపిక్ అయింది.
Also Read : వన్డే కెప్టెన్ గా అతనే.. రోహిత్ కు షాక్ తప్పదా..?
అతనిని టి20 క్రికెట్ లో కెప్టెన్ గా ఎంపిక చేసేందుకు బోర్డు సానుకూలంగా లేదట. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టి20 లలో మెరుగ్గా రాణిస్తున్నాడు. కెప్టెన్ గా కూడా జట్టును అగ్ర స్థానంలో నిలిపాడు. కాబట్టి అతనినే ఆసియా కప్ లో కెప్టెన్ గా కొనసాగిస్తామని బోర్డ్ గిల్ కు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. యువ ఆటగాళ్ళతో కూడా అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. కొత్త ఆటగాళ్ళ కోసం తన బ్యాటింగ్ స్థానాన్ని కూడా సూర్య త్యాగం చేసాడు.
Also Read : ధోనీ తప్పించాడు.. సచిన్ అండగా నిలిచాడు..!
అందుకే తిలక్ వర్మ మూడవ స్థానంలో రాణిస్తున్నాడు. ఇక ఆసియా కప్ లో గిల్ ఆడటం దాదాపు ఖాయంగానే కనపడుతోంది. అటు కెఎల్ రాహుల్, జైస్వాల్ కూడా టి20 క్రికెట్ ఆడే సూచనలు కనపడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ లో సీజన్ లో వీళ్ళు రాణించారు. దీనితో ఖచ్చితంగా వీళ్ళకు జట్టులో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆసియా కప్ లో బూమ్రా, సిరాజ్ ఇద్దరూ ఆడే అవకాశం ఉండవచ్చు. వారితో పాటు అర్శదీప్ సింగ్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.