Thursday, February 5, 2026 03:14 AM
Thursday, February 5, 2026 03:14 AM

కరూర్‌లో ఘోర విషాదం – రాజకీయ సభల్లో పాఠం నేర్చుకోవాలిసిందే

తమిళనాడు కరూర్‌లో సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన మీటింగ్‌లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది మ‌ృతి చెందారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉంది. గాయపడిన వారిని కరూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూర్ స్పందించారు. జిల్లా కలెక్టర్‌ను సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్య మంత్రి, పాఠశాల విద్యా మంత్రిని కరూర్‌కు త్వరగా వెళ్లాలని చెప్పారు.

కరూర్‌లో విజయ్ నేతృత్వంలోని టివికె ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా ప్రజలను కలచివేసింది. రాజకీయ సభల్లో జనాలు అధిక సంఖ్యలో పాల్గొనడం సహజం. కానీ ఆ ఉత్సాహంలో సరైన ప్రణాళిక లేకపోతే ప్రాణాంతకమవుతుంది. కరూర్‌ ఘటన అందుకు తాజా ఉదాహరణ.

Also Read : ఇంతకూ ఆ లేఖ నిజమేనా..?

రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు భారీ సభలు, ర్యాలీలు ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇందులో ముందుగా ఆలోచించవలసింది ప్రజల ప్రాణ భద్రత. సరైన భద్రతా ఏర్పాట్లు, ప్రాంగణం సామర్థ్యం అంచనా, ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలు లేకపోతే చిన్న తప్పిదమే పెద్ద విషాదంగా మారుతుంది. ఈ విషాదానికి కేవలం జనసంద్రం ఉత్సాహమే కారణం కాదు. ఆర్గనైజింగ్ లోపాలు, పోలీసు-అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ పార్టీ అధిక ఉత్సాహం అన్నీ కలిసి కారణమయ్యాయి. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతను ఎవరి మీద వేసుకోవాలో స్పష్టత రావాలి. లేకపోతే ప్రతి ఎన్నికల సీజన్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం తప్పదు.

Also Read : ట్రంప్ సర్కార్ దారుణం.. 73 ఏళ్ళ భారత మహిళపై కఠిన చర్యలు..!

కరూర్‌లో విషాదం మనకు ఒక గట్టి పాఠం చెబుతోంది. రాజకీయ సభలకు స్పష్టమైన గరిష్ట హాజరు పరిమితి ఉండాలి. ప్రవేశ ద్వారాలు, అత్యవసర బయటపడే మార్గాలు బలపరచాలి. వైద్య బృందాలు, అంబులెన్స్‌లు ముందుగానే సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా, ప్రజలు కూడా అలజడికి లోనుకాకుండా శాంతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ ర్యాలీలు అవసరమే. కానీ ప్రజాస్వామ్యం విలువ ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదు. కరూర్‌లో చనిపోయిన మహిళలు, పిల్లల అమాయక ప్రాణాలు మనకు ఇది గుర్తుచేస్తున్నాయి. ఇకనైనా రాజకీయ నాయకులు, అధికారులు, పార్టీలు — అందరూ కలిసి ప్రజా భద్రతను మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన సమయం ఇది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్