Friday, September 12, 2025 05:22 PM
Friday, September 12, 2025 05:22 PM
roots

ప్రభుత్వానికి కొత్త చిక్కుగా సరస్వతి వ్యవహారం…!

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి సరస్వతి పవర్ కంపెనీ భూముల వ్యవహారం సంచలనమైంది. ఇటీవల ఆ భూముల వద్దకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటన చేసింది. గతంలో సరస్వతీ పవర్ కంపెనీ భూములకు సంబంధించిన భూములలో ప్రభుత్వ భూమి కూడా ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం… ఈ మేరకు అధికారులపై సీరియస్ అయింది. సరస్వతీ భూములకు సంబంధించి అటవీశాఖతో పాటు రెవిన్యూ శాఖ అధికారులు సర్వే నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Also Read: సిఆర్డీఏ కమీషనర్ వర్సెస్ నారాయణ… చంద్రబాబు కీలక నిర్ణయం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సర్వే నిర్వహించారు అధికారులు. సర్వే సందర్భంగా పలువురి రైతులతో కూడా అధికారులు మాట్లాడారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైనట్టు గుర్తించారు. ప్రభుత్వ భూములతో పాటు అటవీ శాఖ భూములకు సంబంధించిన వాటిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలతో అసైన్డ్ భూములకు సంబంధించిన యజమానులకు నోటీసులు పంపించారు. 15 రోజులలో నోటీస్ కి రిప్లై ఇవ్వాలని నోటీసులు పంపించారు అధికారులు.

Also Read: వేరే నాయకులు లేరా…? నాగబాబుకే ఎందుకు…?

అసైన్డ్ భూములకు సంబంధించి సరైనటువంటి వివరణ ఇవ్వనటువంటి యజమానుల నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే భూములను స్వాధీనం పరుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చర్యలు చేపట్టారు. మొత్తం 17 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అసైన్డ్ భూములను వేరే వారికి బదలాయించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ భూమిని దుర్వినియోగపరిస్తే వెనక్కి తీసుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో లబ్ధిదారుల నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న భూముల్లో రైతుల భూములు ఉండటంతో తిరిగి ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్