టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా.. వివాహం ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత నేషనల్ వైడ్ గా మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ కేరళ కుట్టీ.. ఇప్పుడు తన డైరెక్టర్ రాజ్ నిడమోరు ను వివాహం చేసుకుని.. టాక్ ఆఫ్ ది టౌన్ అయిపొయింది. మూవ్ ఆన్ అంటూ.. రెండవ పెళ్లి సైలెంట్ గా చేసుకుని.. పర్సనల్ లైఫ్ ను లీడ్ చేసేందుకు రెడీ అయిపొయింది శ్యాం. ప్రస్తుతం ఈ వివాహం సోషల్ మీడియాలోనే కాకుండా సినిమా వర్గాల్లో కూడా సంచలనంగా మారుతోంది.
Also Read : అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్న విడుదల రజనీ..?
సినిమా పరిశ్రమలో కూడా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఈ వివాహం చేసుకున్న సమంతా గురించి ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతోంది. దానికి కారణం ఆమె చేతికి ఉన్న ఉంగరమే. 2025 ఫిబ్రవరిలోనే సమంతా.. రాజ్ నిడమోరుతో నిశ్చితార్ధం చేసుకుందనే అనుమానాలు మొదలయ్యాయి. సమంత తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో “01.12.2025” అనే క్యాప్షన్ తో షేర్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే నిశ్చితార్ధం మాత్రం ఫిబ్రవరి 13న జరిగినట్టు ఇప్పుడు చర్చ మొదలైంది.
Also Read : ఇక స్లీపర్లో కూడా అవి ఇస్తారంట..!
ఫిబ్రవరి 13న ప్రేమికుల దినోత్సవానికి ముందు సమంత పోస్ట్ చేసిన ఫోటో డంప్ లో ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఆ పోస్ట్ లో మొదటి ఫోటోలో సమంతా రోజ్ కలర్ డ్రెస్ లో కనపడింది. ఆమె వేలికి డైమండ్ రింగ్ ఉంది. ఆ రింగ్ హైలెట్ చేస్తూ ఫోటో దిగింది. దీనితో ఆమె అప్పుడే నిశ్చితార్ధం చేసుకుందంటున్నారు ఫ్యాన్స్. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉంగరం విలువ రూ. 1.5 కోట్లు. ఇప్పుడు ఆ ఫోటోలతో పాటు ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

