ఐబొమ్మ.. దాదాపుగా పదేళ్ళ నుంచి ఈ పేరు వింటే సినీ పరిశ్రమ వణికిపోయింది. ఎక్కడి నుంచి సినిమాలు అప్లోడ్ అవుతున్నాయో అర్ధం కాక సైబర్ క్రైమ్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేసారు. ఇదే క్రమంలో పోలీసులకు ఐబొమ్మ నుంచి వార్నింగ్ లు కూడా వెళ్ళాయి. సినిమా పరిశ్రమ మాత్రం ఎలాగైనా సరే పట్టుకోండి ప్లీజ్ అంటూ రిక్వస్ట్ ల మీద రిక్వస్ట్ లు చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు భార్య కారణంతో హైదరాబాద్ వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : మరో ఘోరం.. ఈసారి మక్కాలో.. అచ్చు కర్నూలు ప్రమాదం మాదిరిగానే…!
దీనిపై కాసేపటి క్రితం హైదరాబాద్ సీపీ సజ్జన్నార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. పైరసీ వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా పైరసీ అనేది తీవ్రమైన సమస్య అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేదించామని తెలిపారు. ఐబొమ్మ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశామన్నారు. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖ.. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడని, ప్రహ్లాద్ కుమార్ వెల్లల పేరుతో ఇమ్మడి రవి డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు తీసుకున్నారని గుర్తించామన్నారు.
Also Read : తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
ఇమ్మడి రవిపై మరో 4 కేసులు నమోదయి ఉన్నాయని, ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేశాడని, సినిమా పైరసీ చేసి.. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారని, బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పించి మరింత నష్టం చేశాడన్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇక అతనిని అరెస్ట్ చేయడంతో కాసేపటి క్రితం.. సీపీ సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు భేటీ అయ్యారు.

