Saturday, September 13, 2025 02:35 PM
Saturday, September 13, 2025 02:35 PM
roots

సంక్రాంతి కోటా హౌస్ ఫుల్..!

సంక్రాంతి పండుగ అంటే చాలు అందరికీ సొంత ఊరు గుర్తుకు వస్తుంది. ఇదేంటి దసరా కూడా రాకముందే సంక్రాంతి ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా… సంక్రాంతి పండుగకు 4 నెలల ముందే….. అన్ని రైళ్లల్లో సీట్లు నిండిపోయాయి. పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు చేరుకునే వారు నాలుగు నెలలు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 300 దాటిపోవడంతో ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

పండుగ అంటే నగరాల్లో ఉండే వాళ్లకు ముందుగా గుర్తుకు వచ్చేది సొంత ఊరు. అందులోను సంక్రాంతి పండుగ అంటే చాలు సొంత వూర్లో బంధువుల మధ్య పండుగ చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. సొంత గ్రామాలకు చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా నాలుగు నెలలు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సొంత గ్రామాలకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు.

సంక్రాంతి పండుగకు ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీగా వస్తుంటారు. సొంత గ్రామాల్లో బంధువుల మధ్య పండుగ జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు గ్రామాల బాట పడతారు. నగరంలో ఉద్యోగాలు చేసే వారితో పాటు విద్యార్థులు, వ్యాపారస్థులు కూడా తమ సొంత ఊరు బాటపడుతున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ నుంచి నడిచే అన్ని రైళ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. గోదావరి, గౌతమి, విశాఖ, జన్మభూమి, ఫలక్ నుమా, గరీభ్ రథ్, దురంతో రైళ్లలో టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. సాధారణంగా వెయిటింగ్ లిస్ట్ 3 వందల వరకు రిజర్వేషన్ సిస్టమ్ అంగీకరిస్తుంది. అది దాటితే రిజర్వేషన్లను తిరస్కరిస్తుంది. ప్రస్తుతం ఈ రైళ్లలో ఇదే పరిస్థితి.

Read Also : అసలు… వాళ్లిద్దరూ ఏమయ్యారు..?

ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రిజర్వేషన్ టికెట్లను నాలుగు నెలలు ముందుగా విడుదల చేస్తారు. సాధారణ రోజుల్లో నెల రోజుల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగ రోజుల్లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధం. అన్ని రైళ్లలో టికెట్లు ముందుగానే అయిపోయాయి. ముందు రోజు తత్కాల్ టికెట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. అది కూడా దొరకకపోతే అధిక ధరలు చెల్లించి ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం చేయాల్సిందే. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ చివరి నిమిషం వరకు దీనిపై రైళ్ల శాఖ అధికారులు ప్రకటన చేయడం లేదు.

ప్రతి ఏడాదిలా కాకుండా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ముందుగా ప్రకటించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

పోల్స్