ఇండియా వైడ్ గా పుష్ప 2 సినిమా దుమ్ము రేపుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాడు పుష్ప. ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా వసూళ్లు మాత్రం ఆగలేదు. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా… డిసెంబర్ 4 సాయంత్రం నుంచే ప్రీమియర్లు స్టార్ట్ చేసారు. తొలిరోజు తెలుగు, హిందీ భాషల్లో 50 కోట్ల నికర వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు నుంచే రికార్డుల వేట షురూ చేసింది.
Also Read :ఏపీలో విమానాశ్రయాలకు కొత్త కళ
ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వం వహించిన మొదటిరోజు రూ.175.1 కోట్ల వసూళ్లు సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉన్న అత్యధిక తొలిరోజు వసూళ్ల (రూ. 133 కోట్లు)ను ‘పుష్ప-2’ బ్రేక్ చేసింది. తొలిరోజు కలెక్షన్లు ఎక్కువగా తెలుగు నుంచే వచ్చాయి. తెలుగులో ఏకంగా రూ.95.1 కోట్లు రాబట్టింది పుష్ప2.
Also Read :కాంగ్రెస్ ఏడాది పాలన.. ఓల్డ్ సిటీకి గుడ్ న్యూస్..!
అలాగే హిందీ వెర్షన్ రూ.67 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళంలో రూ. 7 కోట్లు, కన్నడలో రూ. 1 కోటి, మలయాళంలో రూ. 5 కోట్లు రాబట్టింది పుష్ప ది రూల్. ఈ వీకెండ్ లో రూ. 250 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాకు తెలుగు కంటే నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. జాతర సీన్ కోసమే థియేటర్ కు క్యూ కడుతున్నారు.

