అమెరికా వీసాల విషయంలో అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆందోళన కలిగిస్తోంది. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది ట్రంప్ సర్కార్. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వ్యాపార, పర్యాటక వీసాల కోసం అప్లై చేసేవారు.. అమెరికాలోకి అడుగుపెట్టాలంటే.. 15,000 డాలర్ల వరకు బాండ్ను సమర్పించాలని విదేశాంగ శాఖ ప్రతిపాదిస్తోంది. మంగళవారం ఫెడరల్ రిజిస్టర్లో దీనికి సంబంధించిన నోటీసును ప్రచురిస్తారని అక్కడి మీడియా వెల్లడించింది.
Also Read : మరో 10 రోజులే సమయం..!
12 నెలల పైలట్ ప్రోగ్రామ్ను విదేశాంగ శాఖ ప్రారంభిస్తుందని తెలిపింది. అధిక ఓవర్స్టే రేట్లు, లోపభూయిష్ట అంతర్గత డాక్యుమెంట్ భద్రతా నియంత్రణలు ఉన్న దేశాల ప్రజలు వీసా కోసం అప్లై చేసినప్పుడు 5 వేలు, 10 వేలు, 15 వేల డాలర్ల విలువ చేసే బాండ్ లను పోస్ట్ చేయాలి. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది విదేశాంగ శాఖ. అదనపు వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో ఈ రూల్ లేదు. ఈ రెండు రూల్స్ 15 రోజుల్లో అమలులోకి రానున్నాయి.
Also Read : ది బెస్ట్ టెస్ట్ మ్యాచ్.. హైదరాబాద్ నవాబ్ చాంపియన్ ఆట..!
వీసా మినహాయింపు కార్యక్రమంలో ఉన్న దేశాల పౌరులకు ఈ బాండ్ వర్తించదు. 90 రోజుల వరకు వ్యాపారం, పర్యాటకం కోసం అమెరికాలో ఉండేందుకు అనుమతి ఇస్తారు. వీసా మినహాయింపు ఉన్న 42 దేశాలలో ఎక్కువ యూరప్ లోనే ఉన్నాయి. మరికొన్ని ఆసియా, మధ్యప్రాచ్యంలో ఉన్నాయి. వీసా బాండ్లను గతంలో ప్రతిపాదించారు కానీ అమలు చేయలేదు. ఈ విషయంలో ప్రజల్లో అనుమానాలు ఉండటంతో అమెరికా విదేశాంగ శాఖ ముందుకు వెళ్ళలేదు. ఈ కార్యక్రమం అమలులోకి వచ్చిన తర్వాత దేశాల లిస్టు ను రిలీజ్ చేస్తారు. దరఖాస్తుదారుడి వ్యక్తిగత పరిస్థితులను బట్టి బాండ్ను మాఫీ చేయవచ్చు.




