హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అయితే మంచిగా కంటే చెడు వార్తలతోనే మీడియాలో నిత్యం వినిపిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. జూబ్లీ హిల్స్ సొసైటీలో సభ్యత్వానికి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. ప్రైవేటు భూములను సొసైటీ సభ్యులకు అమ్ముకుంటూ 5 వేల కోట్ల రూపాయల స్కాం కి సొసైటీ అధ్యక్షుడు పాల్పడ్డారని సభ్యులలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే 800 మందిని సరైన అడ్రస్ లేదని కారణంగా తొలగించిన ప్రస్తుత పాలకమండలి.. ఇదే అదునుగా తమ వారిని ఎనిమిది వందల మందిని హౌసింగ్ సొసైటీ లోకి అక్రమంగా చేర్చుకునే ప్రయత్నం చేస్తుందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సభ్యులు… 1200 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచి.. మళ్లీ కొత్త వారిని తీర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సభ్యులు. సొసైటీ అధ్యక్షుడే ఇలా ప్రైవేటు భూములను అమ్ముకోవడంపై సొసైటీ సభ్యులలో తీవ్ర చర్చ జరుగుతుంది.

