గువాహాటి టెస్ట్ మూడో రోజు పూర్తిగా దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. భారత ఇన్నింగ్స్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ మరియు కెఎల్ రాహుల్ జోడీ నిలిచి మంచి పునాది వేశారు. కానీ ఆ తరువాత వచ్చిన ఏ ఒక్క ఆటగాడు కూడా దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ ఎదుర్కోవడంలో పరిణితి చూపించలేదు. ప్రత్యేకంగా మార్కో జాన్సెన్ తన ఎత్తు, వేగం మరియు షార్ప్ బౌన్స్ను సద్వినియోగపరుచుకొని భారత మిడిల్ ఆర్డర్ ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ జాన్సెన్ బౌలింగ్కు సరైన టెక్నిక్ మరియు షాట్ సెలెక్షన్ చూపలేకపోవడంతో భారత బ్యాటింగ్ కుప్పకూలింది.
Also Read : నెల్లూరు వైసీపీకి ఊహించని షాక్..!
భారత మిడిల్ ఆర్డర్లో రిషభ్ పంత్, నితీష్ రెడ్డి, సాయి సుధర్షన్ వంటి కీలక బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోవడం జట్టు పతనానికి ప్రధాన కారణమైంది. అనవసరమైన అగ్రెసివ్ షాట్లు, ఒత్తిడిలో దైర్యం కోల్పోవడం, బౌన్స్ను సరిగా అంచనా వేయలేకపోవడం — ఇవన్నీ భారత బ్యాటింగ్ను ఒక్కసారిగా కూలదోచాయి. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్ ఇచ్చిన 70+ రన్స్ భాగస్వామ్యం మాత్రమే కొంత ఆశలు చిగురింపుచేసింది, కానీ మ్యాచ్ దిశను మార్చడానికి అది సరిపోలేదు. భారత జట్టు 201 పరుగుల వద్దనే కుప్పకూలడంతో సౌతాఫ్రికా బౌలర్లు సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపారు.
Also Read : కర్ణాటక సీఎం కుర్చీ.. మల్లికార్జున ఖర్గే సీరియస్..
ఇక సౌతాఫ్రికా మ్యాచ్ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని అందుకున్న వారు, ఫాలో-ఆన్ విధించకుండా మళ్లీ బ్యాట్ చేసి ఆధిపత్యాన్ని ఇంకా పెంచుకున్నారు. స్టంప్స్ సమయానికి 314 పరుగుల భారీ లీడ్తో సౌతాఫ్రికా దాదాపు మ్యాచ్ను తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ పరిస్థితుల్లో భారత్కు ఇప్పుడు గెలుపు మాట పక్కనపెడితే, ఓటమి నివారించడం కూడా ఒక పెద్ద సవాలుగా ఉంది. మొత్తం మీద మూడో రోజు భారత బ్యాటింగ్ లోపాలు మరియు సౌతాఫ్రికా బౌలింగ్ నైపుణ్యం మ్యాచ్ను దక్షిణాఫ్రికా దిశగా నడిపించాయి.

