భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం ముదురుతున్న నేపధ్యంలో.. ఆ దేశానికి అందుతున్న సహాయం ఆశ్చర్యం కలిగిస్తోంది. యుద్ధం సమయంలో.. పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం చేసింది. దీనిపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ ఓటింగ్ను. బహిష్కరించిన భారత్.. పాక్కుి సాయంపై నిరసన వ్యక్తం చేసింది. 28 ఏళ్లలో 28 సార్లు పాక్కుి ఆర్థిక సాయం అందించింది ఐఎంఎఫ్. అయితే దీని వెనుక అమెరికా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది భారత్.
Also Read :తప్పు చేసిన వాడ్ని వదలను.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
అమెరికా జోక్యం లేకుండా పాకిస్తాన్ కు అంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో అమెరికా తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ వైపు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నా, ఉగ్రవాదంపై పోరుకు తాము ఇచ్చిన విమానాలను భారత్ పై దాడులకు వాడుతున్నా అమెరికా మాత్రం మౌనంగా ఉంటుంది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.. రెండు దేశాల మధ్య దాడులు సరికాదు.. శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని.. చెప్పే ప్రయత్నం చేస్తూ.. పాకిస్తాన్ కు ఆర్ధిక సాయం పరోక్షంగా అందించడం ఆశ్చర్యం కలిగించింది.
Also Read :యుద్ధం మొదలైందా..? పాక్ టార్గెట్ చేసిన సిటీలు ఇవే
ఇక పాకిస్తాన్ కు ఆ దేశంలో బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ వాహనాలను బలూచ్ ఆర్మీ తగలబెట్టింది. హైవేపై ఆర్మీ వాహనాలు తగలబెట్టింది. మరోవైపు స్వదేశంలో కూడా ఆ దేశ ప్రధానికి సహకారం లభించడం లేదు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్కు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పలు సూచనలు చేసాడు. భారత్తోల దూకుడు వద్దన్న నవాజ్ షరీఫ్, దౌత్య మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించాడు. అనవసరంగా సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించాడు.

