బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ అనుసరించిన వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. టి20 వరల్డ్ కప్ నుంచి బహిష్కరించే అవకాశం ఉందనే వార్తలు రెండు రోజుల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు అదే గనుక జరిగితే మాత్రం పాకిస్తాన్ కు ఏ విధంగా బుద్ధి చెప్పాలో.. ఐసీసీ ఆ విధంగా చెప్పేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 15న భారత్తో జరిగే గ్రూప్ ఎ మ్యాచ్ను బహిష్కరించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపధ్యంలో.. ఐసీసీ వర్గాల నుంచి కీలక సమాచారం వెలువడింది.
Also Read : వైసీపీపై ప్రజాగ్రహం.. లేదంటే బహిష్కరణే..!
క్రిక్బజ్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ కు దాని తర్వాత విధించబడే తీవ్రమైన ఆంక్షల గురించి స్పష్టమైన అవకాశం ఉందని తెలిపింది. బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే.. టోర్నీలో పాల్గొనే అంశంపై ఐసీసీతో చేసుకున్న భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అప్పుడు ఐసీసీ తీసుకునే నిర్ణయాలకు పాక్ బాధ్యత వహించాలి. గ్లోబల్, ఆసియా కప్ టోర్నమెంట్ల నుండి సస్పెన్షన్ కు గురయ్యే ఛాన్స్ ఉంది. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో విదేశీ ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOCల)లు కూడా ఐసీసీ ఇచ్చే ఛాన్స్ ఉండదు.
Also Read : మెగాస్టార్తో ఢీ అంటున్న సింగర్
పాక్.. చెప్పిన వేదికలోనే వారు ఆడుతున్నారు. పాకిస్తాన్ డిమాండ్ లను ఐసీసీ అంగీకరించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్ గనుక అతి చేస్తే మాత్రం.. అది పాక్ క్రికెట్ బోర్డు పతనమే అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటీ అంటే.. ఒకవేళ పాక్ తప్పుకుంటే గ్రూప్ ఏలో బంగ్లాదేశ్ ను ఐసీసీ అనుమతించే అవకాశం కూడా ఉండవచ్చు అంటూ జాతీయ మీడియా పేర్కొంది. అప్పుడు శ్రీలంకలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు బంగ్లాదేశ్ ఆడుతుంది.

